మాంసంలో మోసం..వ్యర్ధాలను రెస్టారెంట్లకు విక్రయిస్తున్న ప్రవాసీయుల అరెస్టు

- September 07, 2017 , by Maagulf
మాంసంలో మోసం..వ్యర్ధాలను రెస్టారెంట్లకు విక్రయిస్తున్న ప్రవాసీయుల  అరెస్టు

మస్కట్ : ధనార్జనే పరమావధిగా భావించిన కొందరు ప్రవాసీయులు కక్కుర్తి ఆదాయం కోసం అర్రులు చాచి ...చివరకి కారాగారంలో ఊచలు లెక్కబెడుతున్నారు. రస్టాక్ లోని మాంసం అమ్మే వివిధ కబేళాలలో మేకలు, గొర్రెలు తదితర జంతువుల తలలు, తోకలు, కాలి గిట్టలు తదితర పారవేసిన మాంస వ్యర్ధాలను పెద్ద ఎత్తున సేకరించి  ముసున్నహ్ సమీపంలోని విలాయత్ లో అద్దెకు తీసుకున్న పొలంలో వాటిని మరోమారు శుభ్రపర్చి వాటి నుంచి మరల మాంసాన్ని సేకరించి పలు రెస్టారెంట్లకు తాజా మాంసంగా విక్రయిస్తున్నారు. ఈ తరహా మోసాన్ని పసిగట్టిన పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (పీఏసీపీ) ఈ మాంస మోసంతో సంబంధం ఉన్న  కొంతమంది ప్రవాసీయులను అరెస్టు చేసింది. ఈ అరెస్టులు రాయల్ ఒమాన్ పోలీసులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సహకారంతో వారిని అదుపులోనికి తీసుకొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com