మికా యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థుల స్టడీ టూర్‌‌లో అపశృతి

- September 08, 2017 , by Maagulf
మికా యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థుల స్టడీ టూర్‌‌లో అపశృతి

స్టడీ టూర్‌ ఇద్దరి విద్యార్థుల ప్రాణాలు హరించింది.  వివరాల్లోకి వెళితే మికా యూనివర్సిటీకి చెందిన 47 మంది విద్యార్థులు క్రాప్టింగ్ కమ్యూనికేషన్ కార్యక్రమంలో భాగంగా గోవాకు వెళ్లారు.  వీరంతా కండోలిం బీచ్‌కు వెళ్లారు. అందరు విద్యార్థులు బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. వీరిలో గుర్రం చెందు సాయి జ్ఞానేశ్వర్, అనూజా సుసాన్ పాల్‌లు బలంగా వచ్చిన  అలల తాకిడిలో కొట్టుకుపోయారు.  దీనిని గమనించిని తోటి విద్యార్దులు కేకలు పెట్టడంతో స్థానికుల సాయంతో అంజు మృతదేహాన్ని, 5 గంటల అనంతరం  జ్ఞానేశ్వర్ మృతదేహాన్ని గుర్తించారు.  విగత జీవులుగా పడి ఉన్న వీరిని చూసి సహచర విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు.  వీరిద్దరూ ఎంతో తెలివైన వారని, చదువులో బాగా రాణిస్తున్నారని వర్శిటీ అసోసియేట్ డీన్ సిద్దార్థ్ దేశ్ ముఖ్ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com