మార్చురీ లో లేచిన శవం
- September 08, 2017
కేరళ: రెండు సార్లు మరణాన్ని చవిచూసిన రత్నం అనే ఒక పెద్దావిడ ఉదంతం ఇది. కేరళకు చెందిన 51 ఏళ్ల రత్నం రెండునెలలుగా మదురై మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. జాండిస్, కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆమెకు వెంటిలేటర్ మీదే చికిత్సనందించారు. ఇక లాభం లేదని డాక్టర్లు తేల్చేయడంతో.. ఆఖరిరోజులైనా ప్రశాంతంగా ఇంటివద్ద వుంటారనుకుని కుటుంబీకులు ఆమెను అంబులెన్స్ ఎక్కించారు.
అయితే.. శ్వాస ఆడకపోవడం, కదలిక లేకపోవడాన్ని గమనించి.. మరణించినట్లు నిర్ధారించుకున్నారు బంధువులు. కాసేపు ఏడుపులు.. పెడబొబ్బలు. వెంటనే.. మార్చురీకి తరలించి గంటసేపు అక్కడే ఉంచారు. తీరా అంత్యక్రియల కోసం బైటికి తీయబోతే.. తాను బతికే వున్నానంటూ కళ్ళతో సైగ చేసిందామె. మళ్ళీ అందరిలో ఆనందం. షాక్ నుంచి తేరుకుని ఆమెను సెయింట్ జాన్స్ హాస్పిటల్ లోని ఐసీయూలో అడ్మిట్ చేశారు. డాక్టర్లు, పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది.
దురదృష్టవశాత్తూ ఆ సాయంత్రమే రత్నం 'మళ్ళీ' చనిపోయినట్లు డాక్టర్లు సర్టిఫై చేశారు. ఇలా ఒకే రోజు రెండుసార్లు చనిపోయి 'శవాల గది'లోకెళ్ళి వచ్చిన 'రత్నం' గురించి కేరళలో వింతగా చెప్పుకుంటున్నారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







