చెత్తా చెదారాలను రోడ్లపై విసిరే డ్రైవర్లకు రస్ అల్ ఖైమాలో భారీ జరిమానాలు సిద్ధం
- September 08, 2017
రస్ అల్ ఖైమా: వాహనాలను నడిపే సమయంలో వాహనదారులు, ప్రయాణీకులు ఎవరైతే రోడ్లపైకి చెత్తా చెదారాలను పారవేస్తారో వారికి కొత్త ట్రాఫిక్ రెగ్యులేషన్ విధాన ప్రకారం 1,000 ధిర్హాం ల జరిమానా విధించదమే కాక సంబంధిత డ్రైవర్ లైసెన్స్ పై ఆరు నల్లని చుక్కలు చేర్చనున్నట్లు రస్ అల్ ఖైయామా పోలీసులు చెప్పారు. రస్ అల్ ఖైమా పోలీసుల ట్రాఫిక్ మరియు గస్తీ శాఖ సాధారణ సేవల శాఖ సమావేశం తర్వాత ఈ విషయాన్నీ వెల్లడించారు.ఈ ఏడాది ప్రారంభంలో తమ తమ కారుల నుంచి సిగరెట్ పెట్టెలను రోడ్డుపైకి విసిరివేస్తూ పలువురు వాహనదారులు పోలీసులకు పట్టుబడ్డారు. దాంతో దుబాయ్ పోలీసులు వారికి 1,000 ధిర్హాం ల జరిమానా విధించదమే కాక సంబంధిత డ్రైవర్ లైసెన్స్ పై ఆరు నల్లని చుక్కలు పెట్టారు. ఇది తొలినాళ్లలో 500 ధిర్హాం జరిమానాగా ఉండేది. ఆ తర్వాత దుబాయ్ పోలీసులు ఇదే విధమైన జరిమానాతో శిక్షించబడ్డారు. ఎమిరేట్స్ లోని టాఫిక్ ప్రచారంలో భాగంగా రోడ్డులను కలుషితం చేయటం, భద్రత మరియు అగ్ని ప్రమాదాలు సృష్టించే విధంగా వాహనాలను నడిపేవారిని నిలువరించేందుకు ఈ తరహా చర్యలు తీసుకోనున్నారు. దుబాయ్ మునిసిపాలిటీ ఏప్రిల్ నెలలో కేవలం ఒకే ఒక రోజున షేక్ జాయెద్ రోడ్డులో 30 కిలోల బరువు తూగే పారవేసిన సిగరెట్ల వ్యర్థాలను సేకరించినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!









