మళ్ళీ విదేశాలకు వెళ్ళనున్న జగన్

- September 09, 2017 , by Maagulf
మళ్ళీ విదేశాలకు వెళ్ళనున్న జగన్

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. పెద్ద కుమార్తె హర్షను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చేర్పించేందుకు ఆయన లండన్ వెళుతున్నారు. తన గైర్హాజరీలో పార్టీ కార్యక్రమాలన్నీ విజయసాయిరెడ్డి నిర్వహిస్తారని సీనియర్ నేతలు జగన్ సమాచారమందించారు. మూడు నెలల వ్యవధిలో జగన్ తన కుటుంబంతో రెండోసారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఇందుకోసం కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. మూడు నెలల క్రితం కుటుంబంతో సహా విహారయాత్ర కోసం న్యూజిలాండ్ వెళ్లారు. తాను లేకపోయినా బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఓ వైపు పార్టీ నేతల వలసల ప్రచారం, మరోవైపు వైఎస్సార్ కుటుంబం పేరుతో చేపట్టిన కార్యక్రమం ప్రారంభదశలోనే ఉంది. ఈ దశలో జగన్ విదేశీ పర్యటన ఆ పార్టీ నేతలను కొంచెం గందరగోళానికి గురుచేస్తోంది. అక్టోబర్ నుంచి ప్రారంభించాలనుకుంటున్న పాదయాత్ర కోసం రూట్ మ్యాప్‌ను ఖారారు చేయాల్సి ఉంది. ఈ విషయంలో ఇప్పటికే విజయసాయి రెడ్డి కొంత కసరత్తు చేశారు. పాదయాత్రలో దాదాపుగా వంద నియోజకవర్గాలను కవర్ చేయాలని భావిస్తున్నారు.

పాదయాత్ర సమయంలో ఆయా నియోజకవర్గాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటికే అక్కడినేతలకు సమాచారం అందించినట్లు తెలియవచ్చింది. మొత్తానికి లండన్ పర్యటన తండ్రిగా జగన్‌కు ఆనందం కలిగిస్తున్నా, తిరిగి వచ్చేసరికి పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటుకుంటాయోనన్న ఆందోళన మాత్రం ఉన్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com