మళ్ళీ విదేశాలకు వెళ్ళనున్న జగన్
- September 09, 2017
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. పెద్ద కుమార్తె హర్షను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేర్పించేందుకు ఆయన లండన్ వెళుతున్నారు. తన గైర్హాజరీలో పార్టీ కార్యక్రమాలన్నీ విజయసాయిరెడ్డి నిర్వహిస్తారని సీనియర్ నేతలు జగన్ సమాచారమందించారు. మూడు నెలల వ్యవధిలో జగన్ తన కుటుంబంతో రెండోసారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఇందుకోసం కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. మూడు నెలల క్రితం కుటుంబంతో సహా విహారయాత్ర కోసం న్యూజిలాండ్ వెళ్లారు. తాను లేకపోయినా బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఓ వైపు పార్టీ నేతల వలసల ప్రచారం, మరోవైపు వైఎస్సార్ కుటుంబం పేరుతో చేపట్టిన కార్యక్రమం ప్రారంభదశలోనే ఉంది. ఈ దశలో జగన్ విదేశీ పర్యటన ఆ పార్టీ నేతలను కొంచెం గందరగోళానికి గురుచేస్తోంది. అక్టోబర్ నుంచి ప్రారంభించాలనుకుంటున్న పాదయాత్ర కోసం రూట్ మ్యాప్ను ఖారారు చేయాల్సి ఉంది. ఈ విషయంలో ఇప్పటికే విజయసాయి రెడ్డి కొంత కసరత్తు చేశారు. పాదయాత్రలో దాదాపుగా వంద నియోజకవర్గాలను కవర్ చేయాలని భావిస్తున్నారు.
పాదయాత్ర సమయంలో ఆయా నియోజకవర్గాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటికే అక్కడినేతలకు సమాచారం అందించినట్లు తెలియవచ్చింది. మొత్తానికి లండన్ పర్యటన తండ్రిగా జగన్కు ఆనందం కలిగిస్తున్నా, తిరిగి వచ్చేసరికి పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటుకుంటాయోనన్న ఆందోళన మాత్రం ఉన్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







