జక్కన్న మాట నమ్మి మోసపోయాం అంటున్న సినీ జనాలు
- September 10, 2017
'బాహుబలి' సిరీస్తో నేషనల్ లెవెల్లో రాజమౌళి సెలెబ్రిటీ అయిపోయాడు. సినీ లవర్స్ అందరూ ఆయన తరువాతి మూవీ గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికీ నెక్స్ట్ మూవీ విషయంలో జక్కన్న నుండి క్లారిటీ రాలేదు. 'బాహుబలి' కోసం ఐదు సంవత్సరాలు తపస్సు చేసిన ఆయన.. ఇప్పుడు రిఫ్రెష్ అవుతున్నాడు. పనిలో పనిగా ఈ గ్యాప్లో తన ఫ్యామిలీ ఫ్రెండ్ సాయి కొర్రపాటి సినిమాలని ప్రమోట్ చేస్తున్నాడు.
రిలీజ్కి ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసిన జగపతిబాబు 'పటేల్ సర్' మూవీని రాజమౌళి ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. కానీ.. రిలీజ్ తరువాత ఆ సినిమా ఫ్లాప్గా మిగిలిపోయింది. ఇక రీసెంట్గా నాగ చైతన్య 'యుద్ధం శరణం' ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి మాట్లాడుతూ 'తన స్టోరీలలో కూడా లోపాలు చూపే తన భార్య రమకి 'యుద్ధం శరణం' స్టొరీ బాగా నచ్చేసిందని' చెప్పి సినిమాపై అంచనాలు పెంచేశాడు. కానీ.. రిలీజ్ తరువాత ఆ మూవీకి స్టొరీనే మైనస్ అనే టాక్ వచ్చి ఫ్లాప్ అయింది. దాంతో రాజమౌళి మాటలని నమ్మి ఇకపై సినిమాకి వెళ్ళకూడదనేది సినీ జనాల మాట.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







