తన తెలుగు ప్రావీణ్యాన్ని సాన పెడుతున్న భామ

- September 10, 2017 , by Maagulf
తన తెలుగు ప్రావీణ్యాన్ని సాన పెడుతున్న భామ

'అ..ఆ' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మళయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వన్ ఫస్ట్ మూవీలోనే తన రోల్‌కి తనే డబ్బింగ్ చెప్పుకుంది. తరువాత 'ప్రేమమ్', 'శతమానం భవతి'లాంటి హిట్ మూవీలు చేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం రామ్‌తో 'ఉన్నది ఒకటే జిందగీ' మూవీ చేస్తోంది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో కూడా అనుపమ డబ్బింగ్ చెప్పనుందట. అందుకోసం తెలుగు మరింత పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటోందట.
ముఖ్యంగా డిక్షన్ మీద ఫోకస్ పెట్టిందట. షూట్ గ్యాప్‌లో తెలుగులో పర్ఫెక్షన్ కోసం చాలా కష్టపడుతోందని సమాచారం. సమంత, రకుల్ ప్రీత్, కాజల్ లాంటి హీరోయిన్లు ఎన్ని తెలుగు సినిమాలు చేసినా.. ఇంకా డబ్బింగ్ కోసం అరువు గొంతుల మీద ఆధారపడుతోంటే, అనుపమ మాత్రం మిస్ పర్ఫెక్ట్‌లా తెలుగు పూర్తిగా నేర్చుకోవడానికి డబ్బింగ్ చెబుతుండడం ఆమె కెరీర్‌కి ప్లస్ అవుతుందనేది యూనిట్ మాట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com