భాగ్యనగరాన్ని వణికిస్తున్న డెంగ్యూ
- September 11, 2017
డెంగ్యూ... ఈపేరు వినగానే వణుకుపుడుతోంది. శరీరంలో ప్లేట్లెట్స్ తగ్గిపోయి నీరసంగా తయారవుతారు. సకాలంలో స్పందించకపోతే ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదమూ ఉంది. కొన్నిరోజులుగా హైదరాబాద్ ఆస్పత్రుల్లో డెంగ్యూ లక్షణాలతో చేరుతున్న చిన్నారుల సంఖ్య అధికంగా ఉంటుంది. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
డెంగ్యూ...ఈ వ్యాధి రావడానికి ఆర్బోవైరసం జాతికి చెందిన వైరస్ కారణం. ఈ వైరస్ అతి సూక్ష్మమైనది. ఈ వైరస్ ఏడిస్ ఈజిప్ట్ జాతి దోమ ద్వారా రోగగ్రస్తుల నుంచి ఆరోగ్యవంతులకు సంక్రమిస్తుంది. ఈ దోమే టైగర్ దోమ అని కూడా అంటారు. ఈ దోమలు సాధారణంగా పగటిపూటే కుడతాయి. దోమలు కుట్టిన తర్వాత 5 నుంచి 8 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూ సోకినప్పుడు ఉన్నట్టుండి జ్వరం అధికంగా రావడం, తలనొప్పి ఎక్కువగా ఉండటం, కంట్లో నొప్పి, కండరాళ్లు, కీళ్లనొప్పులు, వాంతి అవుతున్నట్లు అనిపించడం నోరెండిపోవడం జరుగుతుంది.
ఈ లక్షణాలు ఎవరిలో కనిపించినా వెంటనే ఆస్పత్రికి వెళ్లి డెంగ్యూ వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలి. ఈ దోమలు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఎయిర్ కూలర్లు, పూల కుండీల కింద గల సాసర్లు, బయటపెట్టిన టైర్లు, మూతలు పెట్టిన, నీరు నిల్వచేసే తొట్టెలు, కుండీలు, ఫౌంటెన్స్, ఖాలీ డ్రమ్ములు, సన్ షేడ్స్పై నిలిచిన వాన నీరు, బిల్డింగ్లపై నిలిచిన వాన నీటితో ఎక్కువగా పెరుగుతాయి. డెంగ్యూకు సంబంధించి ఏ చిన్న లక్షణం కనిపించినా ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు.
వచ్చాక హడావుడి పడేకన్నా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని డెంగ్యూ రాకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. డెంగ్యూతో రోజుకు కనీసం ఐదుగురు పిల్లలు ఆస్పత్రుల్లో చేరుతున్నారని పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







