ఫ్లోరిడాలోని వరద బీభత్సంతో ప్రజలు దోచుకుంటున్న దొంగలు
- September 11, 2017
అమెరికాలోని ఫ్లోరిడా, మయామిలో ఓ వైపు వరద బీభత్సంతో ప్రజలు అల్లాడిపోతుంటే.. మరోవైపు దొంగలు దొరికినకాడికి దోచుకుంటున్నారు. ప్రాణభయంతో వ్యాపారులు షాపులు వదిలేసి వలసవెళ్లారు. అయితే, రాకాసి గాలుల బీభత్సానికి కొన్ని షాపుల్లో అద్దాలు ధ్వంసమయ్యాయి. మరికొన్ని చోట్ల తలుపులు పగిలిపోయాయి. దీన్ని అదునుగా చేసుకున్న దుంగుడులు.. అందిన కాడికి దోచుకుంటున్నారు. పనికొస్తుందా.? పనికి రాదా? అనేది కూడా చూడకుండా చేతికి ఏది దొరికితే అది భుజాన పెట్టుకుని పారిపోతున్నారు. అయితే, దొంగలే కాదు.. కొందరు సాధారణ పౌరులు కూడా ఇలా లూటీలకు పాల్పడుతున్నట్టు కెమెరాల్లో రికార్డయింది. అయితే, దొంగతనం జరుగుతున్న విషయం తెలిసి పోలీసులు అలర్ట్ అవ్వడంతో వారంతా పారిపోయారు. అయితే, లూటీ చేసిన వారిని వెంటాడి పట్టుకున్నారు పోలీసులు.
ఇక భీకరమైన తుపాను ధాటికి.. నదులు, సరస్సుల్లో ఉండే మొసళ్లు ఊళ్ల మీదకు కొట్టుకొస్తున్నాయి. సొంత గూటికి వెళ్లే దారి తెలియక.. ఇళ్లలోకి చొరబడుతున్నాయి. రోడ్ల మీద ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









