ఫ్లోరిడాలోని వరద బీభత్సంతో ప్రజలు దోచుకుంటున్న దొంగలు
- September 11, 2017
అమెరికాలోని ఫ్లోరిడా, మయామిలో ఓ వైపు వరద బీభత్సంతో ప్రజలు అల్లాడిపోతుంటే.. మరోవైపు దొంగలు దొరికినకాడికి దోచుకుంటున్నారు. ప్రాణభయంతో వ్యాపారులు షాపులు వదిలేసి వలసవెళ్లారు. అయితే, రాకాసి గాలుల బీభత్సానికి కొన్ని షాపుల్లో అద్దాలు ధ్వంసమయ్యాయి. మరికొన్ని చోట్ల తలుపులు పగిలిపోయాయి. దీన్ని అదునుగా చేసుకున్న దుంగుడులు.. అందిన కాడికి దోచుకుంటున్నారు. పనికొస్తుందా.? పనికి రాదా? అనేది కూడా చూడకుండా చేతికి ఏది దొరికితే అది భుజాన పెట్టుకుని పారిపోతున్నారు. అయితే, దొంగలే కాదు.. కొందరు సాధారణ పౌరులు కూడా ఇలా లూటీలకు పాల్పడుతున్నట్టు కెమెరాల్లో రికార్డయింది. అయితే, దొంగతనం జరుగుతున్న విషయం తెలిసి పోలీసులు అలర్ట్ అవ్వడంతో వారంతా పారిపోయారు. అయితే, లూటీ చేసిన వారిని వెంటాడి పట్టుకున్నారు పోలీసులు.
ఇక భీకరమైన తుపాను ధాటికి.. నదులు, సరస్సుల్లో ఉండే మొసళ్లు ఊళ్ల మీదకు కొట్టుకొస్తున్నాయి. సొంత గూటికి వెళ్లే దారి తెలియక.. ఇళ్లలోకి చొరబడుతున్నాయి. రోడ్ల మీద ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







