బహ్రెయిన్ భారతీయ వలసదారుడి మృతదేహానికి అంత్యక్రియలు
- September 12, 2017
మనామా: భారతీయ వలస కార్మికుడు తాండవమ్, జులై 9న తుది శ్వాస విడిచినా, స్వదేశానికి ఆయన మృతదేహాన్ని పంపేందుకు పలు సమస్యలు ఎదురయ్యాయి. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి, మృతదేహాన్ని ఎట్టకేలకు స్వదేశానికి పంపారు. ఈ క్రమంలో ఓవర్సీస్ ఇండియన్ కల్చరల్ కాంగ్రెస్, బహ్రెయిన్ ఇవేండ్రమ్ డిస్ట్రిక్ట్ కమిటీ ప్రెసిడెంట్ షాజి బాధిత కుటుంబానికి సాయపడ్డారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ద్వారా మృతదేహాన్ని శనివారం తరలించారు. 35 ఏళ్ళ క్రితం తమిళనాడులోని పెరంబదూర్ నుంచి బహ్రెయిన్కి వచ్చిన తాండవన్, గత ఏడాది డాక్యుమెంట్స్ని పోగొట్టుకోవడంతో అక్రమ వలసదారుడిగా మారారు. 58 ఏళ్ళ తాండవన్ జులై 9న ప్రాణాలు కోల్పోగా, అతని మృతదేహాన్ని సలామానియా మెడికల్ కాంప్లెక్స్ మార్చురీలో ఉంచారు. మృతదేహం బంధువులకు చేరడంతో, వారు ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







