బహ్రెయిన్ భారతీయ వలసదారుడి మృతదేహానికి అంత్యక్రియలు
- September 12, 2017
మనామా: భారతీయ వలస కార్మికుడు తాండవమ్, జులై 9న తుది శ్వాస విడిచినా, స్వదేశానికి ఆయన మృతదేహాన్ని పంపేందుకు పలు సమస్యలు ఎదురయ్యాయి. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి, మృతదేహాన్ని ఎట్టకేలకు స్వదేశానికి పంపారు. ఈ క్రమంలో ఓవర్సీస్ ఇండియన్ కల్చరల్ కాంగ్రెస్, బహ్రెయిన్ ఇవేండ్రమ్ డిస్ట్రిక్ట్ కమిటీ ప్రెసిడెంట్ షాజి బాధిత కుటుంబానికి సాయపడ్డారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ద్వారా మృతదేహాన్ని శనివారం తరలించారు. 35 ఏళ్ళ క్రితం తమిళనాడులోని పెరంబదూర్ నుంచి బహ్రెయిన్కి వచ్చిన తాండవన్, గత ఏడాది డాక్యుమెంట్స్ని పోగొట్టుకోవడంతో అక్రమ వలసదారుడిగా మారారు. 58 ఏళ్ళ తాండవన్ జులై 9న ప్రాణాలు కోల్పోగా, అతని మృతదేహాన్ని సలామానియా మెడికల్ కాంప్లెక్స్ మార్చురీలో ఉంచారు. మృతదేహం బంధువులకు చేరడంతో, వారు ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
తాజా వార్తలు
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు







