బహ్రెయిన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆర్థిక సాయం..
- September 12, 2017
బహ్రెయిన్: బహ్రెయిన్ లో ఇటీవల ప్రమాదవశాత్తు మృతిచెందిన మార్కంటి బాబు(34) కుటుంబానికి బహ్రెయిన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ విభాగం, తోటి కార్మికులు రూ. 120,309 ఆర్ధిక సాయం అందించారు. తెలంగాణ కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం, పోలంగల్ కలాన్ గ్రామానికి చెందిన మార్కంటి బాబు బతుకు దెరువు కోసం బహ్రెయిన్కు వెళ్లాడు. అక్కడ ఓ ప్రయివేట్ కంపేనీలో విధులు నిర్వహిస్తూ గత నెల ఆగష్టు 8న ప్రమాదవశాత్తు మరణించాడు.
అతడి పార్దీవ దేహాన్ని ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఆగష్టు 23న స్వగ్రామానికి పంపించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. బాబు మరణంతో ఆకుటుంబం పెద్ద దిక్కు కోల్పోయింది. దీంతో ఆ కుటుంబానికి అండగా బహ్రెయిన్ టీఆర్ఎస్ ఎన్నారై సెల్, తోటి కార్మికులు, రూ. 120,309 చెక్ను పంపించి ఆర్ధిక సాయం చేశారు.
సాయం చేసిన వారిలో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి, జనరల్ సెక్రెటరీ డా రవి, సెక్రెటరీలు రవిపటేల్ దెషెట్టి, సుమన్ అన్నారం, గంగాధర్ గుమ్ముల, సంజీవ్ బురమ్, విజయ్ ఉండింటి, సుధాకర్ ఆకుల, నర్సయ్య, Ch రాజేందర్, వినోద్, సాయన్న, వసంత్ తదితరులున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









