పొల్లాచ్చిలో బెల్లంకొండ శ్రీనివాస్‌ పోరాటాలు

- September 12, 2017 , by Maagulf
పొల్లాచ్చిలో  బెల్లంకొండ శ్రీనివాస్‌ పోరాటాలు

బె ల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. శ్రీవాస్‌ దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. అభిషేక్‌ నామా నిర్మాత. ఇటీవల పొల్లాచ్చిలో పీటర్‌ హెయిన్స్‌ ఆధ్వర్వంలో పోరాట ఘట్టాల్ని తెరకెక్కించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ''బలమైన కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమిది. సాంకేతికంగానూ ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాం. పొల్లాచ్చిలో 15 రోజుల పాటు యాక్షన్‌ సన్నివేశాల్ని తెరకెక్కించాం. పీటర్‌ హెయిన్స్‌ సరికొత్తగా డిజైన్‌ చేశారు.

అందులో బెల్లంకొండ శ్రీనివాస్‌ ఎలాంటి డూప్‌ లేకుండా నటించారు. యువతరంతో పాటు, కుటుంబ ప్రేక్షకులకూ నచ్చే చిత్రం అవుతుంది. ఈ సినిమాతో శ్రీనివాస్‌కి సరికొత్త ఇమేజ్‌ ఏర్పడుతుంద''న్నారు. జగపతిబాబు, శరత్‌కుమార్‌, మీనా, వెన్నెల కిషోర్‌, రవికిషన్‌, అశుతోష్‌ రానా, మధు గురుస్వామి తదితరులు నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com