యు.ఏ.ఈ లో శుక్రవారంతో ముగియనున్న లేబర్ మిడ్ డే బ్రేక్
- September 14, 2017
యు.ఏ.ఈ:మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్, జూన్ 15న ప్రారంభమైన మిడ్ డే బ్యాన్ సెప్టెంబర్ 15తో ముగియనుందని ప్రకటించింది. ఇన్స్పెక్షనల్ ఎఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ మెహర్ అల్ ఒబెద్ మాట్లాడుతూ, మిడ్ డే బ్రేక్ రూల్ని పాటించినవారందరికీ అభినందనలు తెలిపారు. 13 ఏళ్ళుగా ఈ మిడ్ డే వర్క్ బ్యాన్ అమల్లో ఉంటోంది. తీవ్రమైన వేసవి తాపం కారణంగా, మధ్యాహ్న సమయాల్లో ఎండలో పనిచేసేవారికి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్న దరిమిలా మిడ్ డే బ్యాన్ని తెరపైకి తెచ్చారు. మిడ్ డే బ్యాన్ సందర్భంగా నిర్దేశిత పని గంటల్లో మాత్రమే ఔట్ డోర్లో కార్మికులతో పని చేయించాల్సి ఉంటుంది. అలాగే కార్మికులకు తగిన సౌకర్యాల్నీ కల్పించాల్సిన బాధ్యత ఆయా సంస్థలపై ఉంటుంది. మిడ్ డే బ్యాన్ ముగిసిన తర్వాత యధాతథంగా పని గంటలు ఉంటాయి.
తాజా వార్తలు
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!









