స్కూళ్ళ రిపెయిర్లపై విద్యార్థుల తల్లిదండ్రుల అసంతృప్తి
- September 14, 2017జెడ్డా: జెడ్డాలో స్కూళ్ళ రిపెయిర్లకు సంబంధించి విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో అసమనం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల సమ్మర్ వెకేషన్ అనంతరం స్కూళ్ళలో ఏర్పాట్లను పరిశీలించిన విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి వీలుగా పాఠశాలల్లో సౌకర్యాలు లేవని ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తగు రీతిలో చర్యలు తీసుకోకపోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. నాలుగు నెలల కాలంలో మొత్తం 650 స్కూళ్ళలో రిపెయిర్ వర్క్లను చేపట్టినట్లు చెబుతున్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అబ్దుల్లా అహ్మద్ అల్ థకాఫి, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లు పరిస్థితులు అధ్వాన్నంగా లేవని అన్నారు. అయితే కొన్ని చోట్ల ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే సరిదిద్దుతామని ఆయన వివరించారు. ఆదివారం నుంచి కొత్త విద్యా సంవత్సరం కోసం స్కూళ్ళు తెరవబడ్తాయి.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







