ఏపీలో ఐటీ రంగానికి పెద్ద పీట వేస్తున్నాం- మంత్రి లోకేష్
- September 15, 2017
సైబర్ సెక్యూరిటీకి ఏపీని కేంద్రంగా చేయాలనే లక్యంతో పనిచేస్తున్నట్టు ఐటీ మంత్రి లోకేష్ తెలిపారు. టెక్నాలజీతో ప్రజలకు సేవలందించాలని ప్రయత్నిస్తున్నామన్నారు. విభజన తర్వాత ఏపీలో ఐటీ రంగం చాలా తక్కువగా ఉండేదన్న లోకేష్.. తమ ప్రభుత్వం సాఫ్ట్ వేర్ రంగానికి పెద్దపీట వేసిందన్నారు. పరిపాలన అంతా టెక్నాలజీ ఆధారంగా జరుగుతుండడంతో హ్యాకింగ్ బెడద లేకుండా ఎలా ఉపయోగించాలనే అంశంపై ఆలోచిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే విశాఖలో అక్టోబర్ 9, 10 తేదీల్లో అంతర్జాతీయ టెక్ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







