ఏపీలో ఐటీ రంగానికి పెద్ద పీట వేస్తున్నాం- మంత్రి లోకేష్

- September 15, 2017 , by Maagulf
ఏపీలో ఐటీ రంగానికి పెద్ద పీట వేస్తున్నాం- మంత్రి లోకేష్

సైబర్ సెక్యూరిటీకి ఏపీని కేంద్రంగా చేయాలనే లక్యంతో పనిచేస్తున్నట్టు ఐటీ మంత్రి లోకేష్ తెలిపారు. టెక్నాలజీతో ప్రజలకు సేవలందించాలని ప్రయత్నిస్తున్నామన్నారు. విభజన తర్వాత ఏపీలో ఐటీ రంగం చాలా తక్కువగా ఉండేదన్న లోకేష్.. తమ ప్రభుత్వం సాఫ్ట్ వేర్ రంగానికి పెద్దపీట వేసిందన్నారు. పరిపాలన అంతా టెక్నాలజీ ఆధారంగా జరుగుతుండడంతో హ్యాకింగ్ బెడద లేకుండా ఎలా ఉపయోగించాలనే అంశంపై ఆలోచిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే విశాఖలో అక్టోబర్ 9, 10 తేదీల్లో అంతర్జాతీయ టెక్ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారని మంత్రి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com