హీరో మోహన్ బాబుతో బాహుబలి భామలు

- September 15, 2017 , by Maagulf
హీరో  మోహన్ బాబుతో బాహుబలి భామలు

రౌడీ సినిమా తరువాత వచ్చిన మామ మంచు అల్లుడు కంచు చేసిన ఆయన ఇప్పుడు మళ్ళీ ఓ సినిమాని స్టార్ చేశారు. మోహన్‌బాబు హీరోగా ఆయన స్వీయ నిర్మాణంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై ఈ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రానికి 'గాయత్రి' అనే పేరును ఖారారు చేశారు. ఈ చిత్రానికి మదన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది, ఇందులోని ఓ ఐటెం సాంగ్ లో స్కార్లెట్‌ విల్సన్‌, మధు స్నేహ కనిపిస్తారని టాక్. తిరుపతిలో వేసిన ప్రత్యేక సెట్‌లో ఇటీవల పాట చిత్రీకరణ జరిగినట్లు తెలుస్తోంది. స్కార్లెట్‌.. పవన్‌కల్యాణ్‌ 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'లో కీలక పాత్ర పోషించింది. 'బాహుబలి' చిత్రంలోని 'మనోహరీ..' పాటలో ప్రభాస్‌తో కలిసి స్కార్లెట్‌, మధు స్నేహ ఆడిపాడిన సంగతి తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com