లండన్లో బాంబు దాడి మా పనే.. ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్
- September 16, 2017
లండన్లోని భూగర్భ రైలులో జరిగిన బాంబు పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ఐసిస్ ప్రకటించింది. ఈ విషయాన్ని యూకే మీడియా వర్గాలు ధ్రువీకరించాయి. లండన్ మెట్రోలో బాంబును పేల్చాం.అంటూ ఐసిస్ ఓ ప్రకటన విడుదల చేసింది.
పార్సన్స్ గ్రీన్ స్టేషన్లోని డిస్ట్రిక్టు లైన్ రైలులో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో 29 మంది గాయపడ్డారు. పేలుడు నుంచి తప్పించుకోవడానికి ప్రయాణికులు పరుగులు పెట్టడంతో స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. టైమర్ ద్వారా ఈ బకెట్ బాంబును పేల్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. యూకేలో ఈ ఏడాది జరిగిన ఐదో ఉగ్రచర్య ఇది.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









