'సైంటిస్ట్' రానా
- September 16, 2017
బాహుబలి చిత్రం తో జాతీయ స్థాయి లో గుర్తింపు పొందిన దగ్గుపాటి రానా..తాజాగా హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెల్సిందే. లండన్ కు చెందిన ప్రొడక్షన్ హౌస్ నిర్మించబోయే చిత్రం ద్వారా రానా హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి విజిల్ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఇది ఓ పెద్ద ఓడ నేపథ్యంలో సాగే కథ.. కాగా ఈ మూవీ లో సైంటిస్ట్ రోల్ లో రానా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
విజిల్ ఓడ 1888 లో అదృశ్యమైంది. 700 మంది ప్యాసింజర్లతో సౌరాష్ట్ర నుంచి బయలు దేరిన ఈ ఓడ కనిపించకుండా పోయింది. ఆ ఓడ అదృశ్యం కావడానికి కారణాలేంటి అని పరిశోధించి సైంటిస్ట్ పాత్రలో రానా కనిపించబోతున్నాడు. ఈ మూవీ 2018 లో సెట్స్ ఫైకి వెళ్లనుంది. తాజాగా రానా నేనే రాజు నేనే మంత్రి మూవీ తో ప్రేక్షకుల ను అలరించాడు. సెప్టెంబర్ 22న తమిళంలో 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం 'నాన్ అనైయిట్టల్' పేరిట విడుదల కాబోతోంది. ప్రస్తుతం రానా తమిళం లో చిత్ర ప్రమోషన్ లలో బిజీ బిజీ గా ఉన్నాడు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







