'సైంటిస్ట్' రానా
- September 16, 2017
బాహుబలి చిత్రం తో జాతీయ స్థాయి లో గుర్తింపు పొందిన దగ్గుపాటి రానా..తాజాగా హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెల్సిందే. లండన్ కు చెందిన ప్రొడక్షన్ హౌస్ నిర్మించబోయే చిత్రం ద్వారా రానా హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి విజిల్ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఇది ఓ పెద్ద ఓడ నేపథ్యంలో సాగే కథ.. కాగా ఈ మూవీ లో సైంటిస్ట్ రోల్ లో రానా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
విజిల్ ఓడ 1888 లో అదృశ్యమైంది. 700 మంది ప్యాసింజర్లతో సౌరాష్ట్ర నుంచి బయలు దేరిన ఈ ఓడ కనిపించకుండా పోయింది. ఆ ఓడ అదృశ్యం కావడానికి కారణాలేంటి అని పరిశోధించి సైంటిస్ట్ పాత్రలో రానా కనిపించబోతున్నాడు. ఈ మూవీ 2018 లో సెట్స్ ఫైకి వెళ్లనుంది. తాజాగా రానా నేనే రాజు నేనే మంత్రి మూవీ తో ప్రేక్షకుల ను అలరించాడు. సెప్టెంబర్ 22న తమిళంలో 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం 'నాన్ అనైయిట్టల్' పేరిట విడుదల కాబోతోంది. ప్రస్తుతం రానా తమిళం లో చిత్ర ప్రమోషన్ లలో బిజీ బిజీ గా ఉన్నాడు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







