ఇకపై జాతీయ పింఛను పధకంలో ప్రవాస భారతీయుల భాగస్వామ్యం
- October 30, 2015
జాతీయ పింఛను పధకం (NPS) యొక్క విస్తృతిని పెంచేందుకు, ఇంకా ప్రవాస భారతీయులకు వృద్ధాప్యoలో
సామాజిక, ఆర్ధిక భద్రతను పెంపొందించేందుకు రిజర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా వారు ప్రవాస భారతీయులు కూడా ఈ
పధకంలో చందాదారులయేందుకు అనుమతించారు. ఈ పధకం కింద సంవత్సర కనీస చందా 6,000 రూపాయలు.
దీని చందా మొత్తాలను ప్రవాస భారతీయులు సాధారణ బాంకింగ్ పద్ధతుల ద్వారా లేదా NRE/ FCNR/NRO
ఖాతాల ద్వారా నైనా చెల్లించవచ్చు అని వారు తెలియజేశారు. ముఖ్యంగా గల్ఫ్ లోని ప్రవాస భారతీయులకు ఈ
పధకం మేలు కలిగిస్తుందని నిపుణుల అభిప్రాయం. యూ. ఏ. ఈ. పెట్టుబడులలో డిపాజిట్లపై వడ్డీ రేట్లు అతి
తక్కువైనందున ప్రవాస భారతీయుల భాగం బహు స్వల్పమని, అందువల్ల వారికి ఈ పధకం మంచి అవకాశమని
దుబాయిలో ఆర్ధిక మరియు సంపదల పోర్టల్ మానేజింగ్ డైరక్టర్ ప్రీతి భాంబ్రి తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









