ఆయన మరణం జర్నలిజానికి తీరని లోటు - బాలకృష్ణ

- September 17, 2017 , by Maagulf
ఆయన మరణం జర్నలిజానికి తీరని లోటు - బాలకృష్ణ

ముక్కుసూటిగా, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే సినీ జర్నలిస్టు సురేష్ కృష్ణమూర్తి మృతి చెందారు. సీనియర్  జర్నలిస్టుగా ఉన్న 52 ఏళ్ల సురేష్  ఉదయం తన  ఇంటి నుంచి ఆఫీసుకు బయలుదేరుతుండగా గుండెనొప్పి వచ్చి కుప్పకూలిపోయారు. దాదాపు ది హిందూ పత్రికలో 25 ఏళ్లు పూర్తి చేసినందుకుగాను ఆయనకు ఈ నెల 20న అవార్డు ఇవ్వనున్నారు. కానీ అంతలోనే ఆయన అకాల మరణం పొందారు. 

ఈ నేపధ్యంలో హీరో బాలకృష్ణ తన సంతాపం ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ...నాకు సురేష్ తో  మంచి అనుబంధం ఉంది, నన్ను ఎక్కువగా ఇంటర్వ్యూలు చేసిన జర్నలిస్ట్ ఆయనే. ఏ విషయాన్నైనా సూటిగా ప్రశ్నించేవాడాయన. అలాంటి మంచి వ్యక్తి నేడు మన మధ్య లేకుండాపోవడం బాధాకరం. ప్రస్తుతం కుంభకోణంలో షూటింగ్ లో ఉండడం వల్ల ఆయన్ను ఆఖరిసారిగా చూసే అవకాశం దక్కడం లేదని బాధపడుతూనే.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి మానసికధైర్యాన్ని ఆ దేవుడు అందించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com