ఆయన మరణం జర్నలిజానికి తీరని లోటు - బాలకృష్ణ
- September 17, 2017
ముక్కుసూటిగా, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే సినీ జర్నలిస్టు సురేష్ కృష్ణమూర్తి మృతి చెందారు. సీనియర్ జర్నలిస్టుగా ఉన్న 52 ఏళ్ల సురేష్ ఉదయం తన ఇంటి నుంచి ఆఫీసుకు బయలుదేరుతుండగా గుండెనొప్పి వచ్చి కుప్పకూలిపోయారు. దాదాపు ది హిందూ పత్రికలో 25 ఏళ్లు పూర్తి చేసినందుకుగాను ఆయనకు ఈ నెల 20న అవార్డు ఇవ్వనున్నారు. కానీ అంతలోనే ఆయన అకాల మరణం పొందారు.
ఈ నేపధ్యంలో హీరో బాలకృష్ణ తన సంతాపం ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ...నాకు సురేష్ తో మంచి అనుబంధం ఉంది, నన్ను ఎక్కువగా ఇంటర్వ్యూలు చేసిన జర్నలిస్ట్ ఆయనే. ఏ విషయాన్నైనా సూటిగా ప్రశ్నించేవాడాయన. అలాంటి మంచి వ్యక్తి నేడు మన మధ్య లేకుండాపోవడం బాధాకరం. ప్రస్తుతం కుంభకోణంలో షూటింగ్ లో ఉండడం వల్ల ఆయన్ను ఆఖరిసారిగా చూసే అవకాశం దక్కడం లేదని బాధపడుతూనే.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి మానసికధైర్యాన్ని ఆ దేవుడు అందించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







