ఐఎస్టీ ఏఎఫ్ వరల్డ్ కప్ ఈవెంట్కు హైదరాబాద్ వేదిక
- September 17, 2017
హైదరాబాద్ మరో అంతర్జాతీయ ఈవెంట్కు వేదికకానుంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు ఐఎస్టీ ఏఎఫ్ వరల్డ్ కప్ ఇంటర్ రెగు సెపక్తక్రా చాంపియన్షిప్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈ టోర్నీ నిర్వహణపై ఎల్బీ స్టేడియంలోని శాట్స్ చైర్మన్ చాంబర్లో ఆదివారం తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడామంత్రి టి.పద్మారావు చైర్మన్గా కమిటీని ఏర్పాటు చేశారు. శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరించనున్నారు. ఈ చాంపియన్షి్ ప్లో 20 దేశాలు పోటీపడనున్నాయి. ఆతిథ్య భారతతో పాటు జపాన్, థాయ్లాండ్, మలేసియా, బంగ్లాదేశ్, సింగపూర్, శ్రీలంక, దక్షిణకొరియా, చైనా, పాకిస్థాన్, నేపాల్, మయన్మార్, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, వియత్నాం, కంబోడియా, చైనీస్ తైపీ, ఇరాన్ తదితర దేశాలు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ జట్లకు హైటెక్ సిటీలోని హావాస్ హోటల్లో బస ఏర్పాటు చేయనున్నారు. టోర్నీ ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







