యూఏఈ తొలి స్మార్ట్ పోలీస్ సర్వీస్ సెంటర్ ప్రారంభం
- September 18, 2017
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్లో స్మార్ట్ పోలీస్ సర్వీస్ సెంటర్ని ప్రారంభించారు. ప్రపంచంలోనే ఈ స్థాయి సర్వీస్ సెంటర్ ఇదేనని ఆయన కొనియాడారు. ఇలాంటి సర్వీస్ సెంటర్స్ని మరిన్ని నెలకొల్పాల్సిందిగా దుబాయ్ పోలీస్కి షేక్ మొహమ్మద్ సూచనలు చేశారు. ప్రపంచంలోనే మేటి స్మార్ట్ సర్వీసుల్ని అందించేలా పోలీస్ వ్యవస్థలో పెను మార్పులు రావడం ఆనందంగా ఉందని చెప్పారాయన. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి మాట్లాడుతూ, రోజులో 24 గంటలూ ఈ సర్వీస్ సెంటర్ పనిచేస్తుందనీ, 33 ఫుల్లీ ఆటోమేటెడ్ సబ్ సర్వీస్లకు ఇది అదనమని అన్నారు. పోలీస్ అండ్ పబ్లిక్ సెక్యూరిటీ - దుబాయ్ డిప్యూటీ ఛైర్మన్ లెఫ్టినెంట్ జనరల్ దహి ఖల్ఫాన్ తమీమ్ పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







