పనామా విమానాశ్రయంలో 200 విమానాలు రద్దు
- September 19, 2017
పనామా: లాటిన్ అమెరికాలో పనామా సిటీ విమానాశ్రయంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. విమానాశ్రయం పవర్ సర్క్యూట్ ప్యానెల్లో సాంకేతిక లోపం తలెత్తటంతో దాదాపు 200 విమానాల రాకపోకలను అధికారులు రద్దు చేశారు. పలు విమానాలు ఆలస్యమవడంతో వేలాది మంది ప్రయాణికులు గంటలకొద్దీ పడిగాపులు పడాల్సి వచ్చింది.
అమెరికా, యూరప్ దేశాల ప్రయాణికుల ప్రధాన గమ్యస్థానం అయిన పనామా సిటీ విమానాశ్రయం సర్క్యూట్ ప్యానెల్లో విద్యుత్ ప్రసారం నిలిచిపోయింది. దీంతో విమాన రాకపోకలను నియంత్రించే వ్యవస్థ పనిచేయటం మానేసింది. ఈ పరిణామంతో 200 విమానాల రాకపోకలను రద్దు చేశారు. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే, వచ్చే ప్రయాణికులతో ఎయిర్పోర్టు నిండిపోయింది. అధికారులు బస్సులు ఏర్పాటు చేసి వారికి హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొందరు లగేజీలను పక్కన ఉంచుకుని విమానాశ్రయంలోనే ఉండిపోయారు.
పనామా ప్రభుత్వ కోపా ఎయిర్లైన్స్ ఈ పరిణామంతో తీవ్రంగా నష్టపోయింది. దాదాపు 140 సర్వీసులను రద్దు చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. కొన్ని గంటల తర్వాత రాకపోకలను పునరుద్ధరించినప్పటికీ రద్దీ కొనసాగుతూనే ఉంది. పరిస్థితి చక్కబరిచేందుకు మరికొన్ని గంటలు పడుతుందని అధికారులు తెలిపారు. ఈ ఎయిర్పోర్టు నుంచి నిత్యం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాతోపాటు యూరప్ ఖండాల్లోని 90 ప్రాంతాలకు విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏడాదికి దాదాపు 14 మిలియన్ల మంది ప్రయాణికులు వచ్చిపోతుంటారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









