పనామా విమానాశ్రయంలో 200 విమానాలు రద్దు
- September 19, 2017
పనామా: లాటిన్ అమెరికాలో పనామా సిటీ విమానాశ్రయంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. విమానాశ్రయం పవర్ సర్క్యూట్ ప్యానెల్లో సాంకేతిక లోపం తలెత్తటంతో దాదాపు 200 విమానాల రాకపోకలను అధికారులు రద్దు చేశారు. పలు విమానాలు ఆలస్యమవడంతో వేలాది మంది ప్రయాణికులు గంటలకొద్దీ పడిగాపులు పడాల్సి వచ్చింది.
అమెరికా, యూరప్ దేశాల ప్రయాణికుల ప్రధాన గమ్యస్థానం అయిన పనామా సిటీ విమానాశ్రయం సర్క్యూట్ ప్యానెల్లో విద్యుత్ ప్రసారం నిలిచిపోయింది. దీంతో విమాన రాకపోకలను నియంత్రించే వ్యవస్థ పనిచేయటం మానేసింది. ఈ పరిణామంతో 200 విమానాల రాకపోకలను రద్దు చేశారు. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే, వచ్చే ప్రయాణికులతో ఎయిర్పోర్టు నిండిపోయింది. అధికారులు బస్సులు ఏర్పాటు చేసి వారికి హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొందరు లగేజీలను పక్కన ఉంచుకుని విమానాశ్రయంలోనే ఉండిపోయారు.
పనామా ప్రభుత్వ కోపా ఎయిర్లైన్స్ ఈ పరిణామంతో తీవ్రంగా నష్టపోయింది. దాదాపు 140 సర్వీసులను రద్దు చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. కొన్ని గంటల తర్వాత రాకపోకలను పునరుద్ధరించినప్పటికీ రద్దీ కొనసాగుతూనే ఉంది. పరిస్థితి చక్కబరిచేందుకు మరికొన్ని గంటలు పడుతుందని అధికారులు తెలిపారు. ఈ ఎయిర్పోర్టు నుంచి నిత్యం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాతోపాటు యూరప్ ఖండాల్లోని 90 ప్రాంతాలకు విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏడాదికి దాదాపు 14 మిలియన్ల మంది ప్రయాణికులు వచ్చిపోతుంటారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







