వేప ఆకులను వేసి ఉంచిన నీటితో స్నానం
- September 19, 2017
రుతువులు మారినప్పుడు ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తుతుంటాయి. అందువల్ల అనారోగ్య సమస్యలు తలెత్తేవరకూ వుండకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో వారందరికీ రోగనిరోధక శక్తి ఉసిరి ఇవ్వండి. ఉసిరిపొడిని పెద్దలు ఒక స్పూన్, పిల్లలు అరస్పూన్ తీసుకోవాలి. అన్నంలో తొలిముద్ద ఉసిరికాయ పచ్చడితో తినండి. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచే సి విటమిన్ను బాగా అందిస్తుంది.
ఆహారంలో అల్లం, వెల్లుల్లి భాగం చేసి క్రమం తప్పక తీసుకోండి. ఇవి యాంటీవైరస్, యాంటీ బ్యాక్టీరియల్ శక్తి కలిగినవి. వేప ఆకులను వేసి ఉంచిన నీటితో స్నానం చేయడం, ఇంట్లో కర్పూరం వెలిగించడం ఆరోగ్యకరం. తులసి ఆకుల రసం తీసి త్రాగితే రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.
యూకలిప్టస్ ఆయిల్ ఆవిరి పీలిస్తే ముక్కులో చేరిన వైరస్లు తొలగిపోతాయి. పసుపు చల్లి ఉడికించిన వంటకాలు, నల్ల మిరియాలు వాడిన వంటకాలు తినటం వల్ల రోగాలు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- భారతీయ వ్యక్తిని చంపిన వ్యక్తులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు..!!
- సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్









