దుబాయ్ లో స్మార్ట్ గ్రిడ్ స్టేషన్ ను నిర్మించనున్న 'దేవా'
- October 31, 2015
దుబాయ్ లోని రువయ్యా లో స్మార్ట్ గ్రిడ్ స్టేషన్ (ఎస్. జి. ఎస్.) ను నిర్మించడానికి దుబాయి విద్యుఛక్తి మరియు నీటి సంస్థ (దేవా) మానేజింగ్ డైరక్టర్ మరియు సి. ఈ. ఓ. - సయీద్ మొహమ్మద్ అల్ తయేర్ మరియు కొరియా ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (కేప్కో) సీక్ చో హ్వాన్ ఐక్ ఒక ఒప్పంద పత్రం మీద సంతకం చేశారు. దుబాయి మరియు దక్షణ కొరియాలలో ఉత్తమ మౌలిక వసతులు పెంపొందించడానికి రెండు సంస్థల కృషిని ఈ ఒప్పందం తెలియజేస్తోంది. ఈ పైలట్ ప్రోజెక్టు - స్మార్ట్ గ్రిడ్లను, స్మార్ట్ సిటీలను, బెంచ్ మార్క్ లను గురించిన సమాచార నివిమయానికి, అవగాహనను పెంపొందించే పరస్పర వర్క్ షాప్ లను ఏర్పాటుచేయడానికై ఉద్దేశించి 2014 సంవత్సరంలో ఇరుపక్షాలు సంతకాలు చేసిన అవగాహనా పత్రం లో భాగమని తెలియవచ్చింది. పవన విద్యుత్తు, బాటరీ ద్వారా శక్తి నిల్వ మరియు భవన నిర్వహణ, భవన పైకప్పులపై ఫోటో వోల్టాయిక్ ప్యానల్ అమరిక వంటి కార్యక్రమాల ద్వారా దుబాయిని మూడు సంవత్సరాలలో ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా తీర్చిదిద్దే అనేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







