దుబాయ్ లో స్మార్ట్ గ్రిడ్ స్టేషన్ ను నిర్మించనున్న 'దేవా'
- October 31, 2015
దుబాయ్ లోని రువయ్యా లో స్మార్ట్ గ్రిడ్ స్టేషన్ (ఎస్. జి. ఎస్.) ను నిర్మించడానికి దుబాయి విద్యుఛక్తి మరియు నీటి సంస్థ (దేవా) మానేజింగ్ డైరక్టర్ మరియు సి. ఈ. ఓ. - సయీద్ మొహమ్మద్ అల్ తయేర్ మరియు కొరియా ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (కేప్కో) సీక్ చో హ్వాన్ ఐక్ ఒక ఒప్పంద పత్రం మీద సంతకం చేశారు. దుబాయి మరియు దక్షణ కొరియాలలో ఉత్తమ మౌలిక వసతులు పెంపొందించడానికి రెండు సంస్థల కృషిని ఈ ఒప్పందం తెలియజేస్తోంది. ఈ పైలట్ ప్రోజెక్టు - స్మార్ట్ గ్రిడ్లను, స్మార్ట్ సిటీలను, బెంచ్ మార్క్ లను గురించిన సమాచార నివిమయానికి, అవగాహనను పెంపొందించే పరస్పర వర్క్ షాప్ లను ఏర్పాటుచేయడానికై ఉద్దేశించి 2014 సంవత్సరంలో ఇరుపక్షాలు సంతకాలు చేసిన అవగాహనా పత్రం లో భాగమని తెలియవచ్చింది. పవన విద్యుత్తు, బాటరీ ద్వారా శక్తి నిల్వ మరియు భవన నిర్వహణ, భవన పైకప్పులపై ఫోటో వోల్టాయిక్ ప్యానల్ అమరిక వంటి కార్యక్రమాల ద్వారా దుబాయిని మూడు సంవత్సరాలలో ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా తీర్చిదిద్దే అనేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు







