డిజేబుల్డ్ గర్ల్ హత్యకేసులో విచారణ వాయిదా
- September 22, 2017
కువైట్ సిటీ: డిజేబుల్డ్ అయిన ఐదేళ్ళ చిన్నారిని హతమార్చిన కేసులో ఓ మహిళ, ఓ వ్యక్తిపై విచారణ అక్టోబర్ 4వ తేదీకి వాయిదా పడింది. ఆగస్ట్లో ఆపరేషన్స్ రూమ్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి ఓ ఫోన్ కాల్ అందింది. ఓ మహిళ, తన కుమార్తె అచేతనావస్థలో పడి ఉందని ఆ ఫోన్ కాల్ ద్వారా తెలియజేసింది.అల్ కోసుర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెక్యూరిటీ సిబ్బంది, పారామెడిక్స్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వారు గుర్తించారు. ఆమె ఒంటిపై గాయాలున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. విచారణలో ఇది హత్యగా నిర్ధారణ అయ్యింది. దాంతో, తల్లిని అదుపులోకి తీసుకున్నారు. తరచూ ఆమె బాయ్ఫ్రెండ్ కూడా ఆ ఇంటికి వచ్చేవాడని తెలుసుకున్న పోలీసులు, అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితురాలి బాయ్ఫ్రెండ్, చిన్నారిని తీవ్రంగా, కొట్టి హింసించాడని పోలీసులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









