డిజేబుల్డ్ గర్ల్ హత్యకేసులో విచారణ వాయిదా
- September 22, 2017
కువైట్ సిటీ: డిజేబుల్డ్ అయిన ఐదేళ్ళ చిన్నారిని హతమార్చిన కేసులో ఓ మహిళ, ఓ వ్యక్తిపై విచారణ అక్టోబర్ 4వ తేదీకి వాయిదా పడింది. ఆగస్ట్లో ఆపరేషన్స్ రూమ్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి ఓ ఫోన్ కాల్ అందింది. ఓ మహిళ, తన కుమార్తె అచేతనావస్థలో పడి ఉందని ఆ ఫోన్ కాల్ ద్వారా తెలియజేసింది.అల్ కోసుర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెక్యూరిటీ సిబ్బంది, పారామెడిక్స్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వారు గుర్తించారు. ఆమె ఒంటిపై గాయాలున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. విచారణలో ఇది హత్యగా నిర్ధారణ అయ్యింది. దాంతో, తల్లిని అదుపులోకి తీసుకున్నారు. తరచూ ఆమె బాయ్ఫ్రెండ్ కూడా ఆ ఇంటికి వచ్చేవాడని తెలుసుకున్న పోలీసులు, అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితురాలి బాయ్ఫ్రెండ్, చిన్నారిని తీవ్రంగా, కొట్టి హింసించాడని పోలీసులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!







