డిజేబుల్డ్ గర్ల్ హత్యకేసులో విచారణ వాయిదా
- September 22, 2017
కువైట్ సిటీ: డిజేబుల్డ్ అయిన ఐదేళ్ళ చిన్నారిని హతమార్చిన కేసులో ఓ మహిళ, ఓ వ్యక్తిపై విచారణ అక్టోబర్ 4వ తేదీకి వాయిదా పడింది. ఆగస్ట్లో ఆపరేషన్స్ రూమ్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి ఓ ఫోన్ కాల్ అందింది. ఓ మహిళ, తన కుమార్తె అచేతనావస్థలో పడి ఉందని ఆ ఫోన్ కాల్ ద్వారా తెలియజేసింది.అల్ కోసుర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెక్యూరిటీ సిబ్బంది, పారామెడిక్స్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వారు గుర్తించారు. ఆమె ఒంటిపై గాయాలున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. విచారణలో ఇది హత్యగా నిర్ధారణ అయ్యింది. దాంతో, తల్లిని అదుపులోకి తీసుకున్నారు. తరచూ ఆమె బాయ్ఫ్రెండ్ కూడా ఆ ఇంటికి వచ్చేవాడని తెలుసుకున్న పోలీసులు, అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితురాలి బాయ్ఫ్రెండ్, చిన్నారిని తీవ్రంగా, కొట్టి హింసించాడని పోలీసులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







