కశ్మీర్‌లో భీకర ఆపరేషన్‌ కొనసాగుతోంది

- September 23, 2017 , by Maagulf
కశ్మీర్‌లో భీకర ఆపరేషన్‌ కొనసాగుతోంది

శ్రీనగర్‌: కశ్మీర్‌లో భీకర ఎన్‌కౌంటర్‌ జరుగుతోంది. బారాముల్లా జిల్లాలోని యురి సెక్టార్‌లో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సైన్యానికి సమాచారం అందింది. దీంతో పక్కాప్రణాళికతో తెల్లవారుజుమాన సైన్యం వాస్తవాధీన రేఖ వద్ద కట్టడి ముట్టడిని నిర్వహించింది. ఈ క్రమంలో కల్గాయ్‌ ప్రాంతంలోని ఉన్న ఉగ్రవాద స్థావరాన్ని బలగాలు చుట్టుముట్టాయి. దీంతో ఉగ్రవాదులకు, బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఒక ఉగ్రవాదిని సైనికులు మట్టుబెట్టారు. ఇంకా ఇద్దరు ఉగ్రవాదులు సజీవంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com