భళా మేరీకోమ్!
- September 23, 2017
హైదరాబాద్: భారత మహిళా బాక్సర్ మేరీకోమ్కు అరుదైన అవకాశం దక్కించుకుంది. నవంబర్లో జరిగే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అథ్లెట్స్ ఫోరంలో ఆమె అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) ప్రతినిధిగా పాల్గొనబోతోంది.
దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. 33 ఏళ్ల మేరీ కోమ్ గతేడాది 'ఐబా' లెజెండ్స్ అవార్డు అందుకుంది. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ అయిన మేరీ కోమ్ నవంబర్ 11 నుంచి 13 వరకు లుసానేలో జరిగే 8వ ఐఓసీ అథ్లెట్స్ ఫోరంలో ఐబా ప్రతినిధిగా వ్యవహరిస్తుంది.
'ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అథ్లెట్లు ఈ ఫోరంలో పాల్గొని తమ అభిప్రాయాల్ని పంచుకోవడమే ఈ వేదిక ఉద్దేశం' అని ఐబా భారత బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడు అజయ్ సింగ్కు లేఖ రాసింది. అయితే వియత్నాంలో నవంబర్ 2 నుంచి 12 వరకు ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్ జరగనుంది.
ఈ టోర్నీ కోసం జరిగే ట్రయల్స్లో మేరీ కోమ్ ఎంపికైతే అథ్లెట్స్ ఫోరంలో పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







