'మహానుభావుడు' కు అతిధిగా విచ్చేయనున్న ప్రభాస్
- September 24, 2017
హైదరాబాద్: శర్వానంద్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'మహానుభావుడు'. ఈ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సింగిల్ కట్ లేకుండా సెన్సార్ బోర్డు చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చినట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. కాగా ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకను నేటి సాయంత్రం నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ దీనికి వేదిక కానుంది. అయితే ఈ వేడుకకు డార్లింగ్ ప్రభాస్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.
యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. మెహరీన్ కథానాయిక పాత్ర పోషించారు. ఎస్. తమన్ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు.
వినోదాత్మకంగా సాగే ఈ ప్రచార చిత్రానికి మంచి స్పందన లభించింది. శుభ్రతకు ప్రాణం ఇచ్చే వ్యక్తి పాత్రలో శర్వానంద్ కనిపించారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







