క్రెడిట్ కార్డుల్ని తిరస్కరిస్తే షాప్స్పై జరీమానాలు తప్పవు
- September 27, 2017
జెడ్డా: చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డుల్ని వినియోగిస్తున్న సమయంలో షాప్ల నిర్వాహకుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతపై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ స్పందించింది. క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపుల్ని షాప్లు తిరస్కరిస్తే, అలాంటి షాప్లపై జరీమానాలు విధిస్తామని హెచ్చరించింది. అలాగే స్వాపింగ్ మెషీన్లను కూడా స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. డిజిటల్ పేమెంట్ పట్ల ప్రాచుర్యం కల్పిస్తోంటే షాప్ల నిర్వాహకులు అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. క్రెడిట్ కార్డ్ వినియోగదారులు షాపుల నిర్వాహకుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చి చూసినప్పుడు 2017 రెండో అర్థభాగంలో పిఓఎస్ ట్రాన్సాక్షన్స్ 15.91 శాతం పెరిగాయి. అయితే బిల్లుకు అదనంగా ఛార్జీల రూపంలో షాప్ల నిర్వాహకులు వసూలు చేస్తుండడం, కొన్ని సందర్భాల్లో క్రెడిట్ కార్డులను తిరస్కరిస్తుండడం ద్వారా కొనుగోళ్ళు మందగించే ప్రమాదముందని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే స్పష్టమైన హెచ్చరికల్ని షాప్ల నిర్వాహకులకు జారీ చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







