కాబుల్ లో రాకెట్ దాడి, బాంబు పేలుళ్లు
- September 27, 2017
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లో ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. ఈ ఉదయం కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో రాకెట్లతో విరుచుకుపడ్డ దుండగులు.. ఇప్పుడు బాంబు దాడులకు దిగారు. 25 నిమిషాల వ్యవధిలో మూడుసార్లు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. నేటి ఉదయం ఎయిర్పోర్టు సమీపంలో రాకెట్ దాడులు జరిగిన విషయం తెలిసిందే. 20 నుంచి 30 రాకెట్లు పడ్డట్లు స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ ఆరు రాకెట్లు మాత్రమే పడినట్లు తెలిపింది. ఈ ఘటన నేపథ్యంలో ఎయిర్పోర్టును ఖాళీ చేయించారు. పలు విమానాలను రద్దు చేశారు. అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటీస్ అఫ్గాన్కు చేరుకున్న కొద్ది గంటలకే ఈ ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. నాటో స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







