ఎతిహాద్ ఎయిర్వేస్ పైలట్ మృతి
- September 27, 2017
దుబాయ్ నుంచి ఆమ్స్టర్డామ్ వెళ్ళాల్సిన ఎతిహాద్ ఎయిర్వేస్ విమానం కువైట్లో ఎమర్జన్సీ ల్యాండింగ్ అయ్యింది. పైలట్ మృతితో ఈ ఎమర్జన్సీ ల్యాండింగ్ చేసినట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించారు. కువైట్లో విమానం ల్యాండ్ అవుతున్న సమయానికి మెడికల్ టీమ్ని అక్కడ ఏర్పాటు చేశారు. అయితే పైలట్ ప్రాణాల్ని మాత్రం కాపాడలేకపోయారు. కెప్టెన్ తీవ్ర అనారోగ్యానికి గురవడంతో వెంటనే ఎమర్జన్సీ కాల్ చేసి, కువైట్కి విమానాన్ని జాగ్రత్తగా మళ్ళించారు. ఈ ఘటన పట్ల తాము తీవ్రంగా కలత చెందినట్లు ఎతిహాద్ ఎయిర్ వేస్ పేర్కొంది. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామనీ, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని ఎతిహాద్ ఎయిర్ వేస్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









