అల్ ఖైల్ రోడ్డుపై ట్రాఫిక్ సమస్యకి 15 మిలియన్ దిర్హామ్ ప్రాజెక్ట్తో చెక్
- September 27, 2017
దుబాయ్లో చేపడ్తున్న 15 మిలియన్ దిర్హామ్ విలువైన కొత్త ప్రాజెక్ట్ అల్ ఖైల్ రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలనుంచి వాహనదారులకు ఉపశమనాన్నివ్వనుందని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించింది. దుబాయ్ ప్రాపర్టీస్తో కలిసి ఆర్టిఎ ఈ ప్రాజెక్ట్ చేపడుతోంది. షేక్ రషీద్ రోడ్డు నుంచి కల్చరల్ విలేజ్లోకి ఎంట్రీ ఇచ్చేలా ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు. 14.87 మిలియన్ దిర్హామ్ల విలువైన ఈ రపాజెక్ట్ కల్చరల్ విలేజ్ని సమీపంలో ఉన్న రోడ్స్ నెట్వర్క్తో అనుసంధానం చేస్తుంది. ఆర్టిఎ ట్రాఫిక్ అండ్ రోడ్స్ ఏజెన్సీ సీఈఓ మైతా బిన్ అదాయ్ మాట్లాడుతూ, రోడ్ యూజర్స్ సేఫ్టీ నిమిత్తం ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు చెప్పారు. పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాల్ని తీర్చేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపకరిస్తుంది. వచ్చే ఏడాది తొలి క్వార్టర్ నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి కానుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









