విజయవాడ బస్‌స్టేషన్‌లో డిజిటల్ మినీ థియేటర్ల నిర్మాణం

- November 01, 2015 , by Maagulf
విజయవాడ బస్‌స్టేషన్‌లో డిజిటల్ మినీ థియేటర్ల నిర్మాణం

విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో సంక్రాంతి నుంచి ప్రయాణికులకు వెండితెరలు అందుబాటులోకి రానున్నాయి!. స్టేషన్‌లోకి బస్సులు వచ్చే ప్లాట్‌ఫామ్‌ల బ్లాక్‌లో రెండు డిజిటల్ మినీ థియేటర్ల నిర్మాణం చేపట్టారు. ఒక్కో థియేటర్‌లో 134 సీట్లు ఉంటాయి. రూ.1.3 కోట్లతో చేపట్టిన మినీ డిజిటల్ థియేటర్ల నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. గడువులోగా నిర్మాణం పూర్తయితే వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి సినిమా ప్రదర్శనలు ప్రారంభం అవుతాయి. టిక్కెట్ ధర రూ.80గా నిర్ణయించే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com