పోలీస్ శిక్షణలో ఆఫ్గాన్ పోలీసులకు భారత్ శిక్షణ
- September 28, 2017
పోలీస్ శిక్షణలో సాంకేతిక సహకారానికి సంబంధించి భారత్, ఆఫ్గానిస్థాన్ల మధ్య గురువారం అవగాహనా ఒప్పందం (ఎంఓయు) కుదిరింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆఫ్గాన్ ముఖ్య కార్యనిర్వాహకుడు (అధ్యక్షుడితో సమానమైన హోదా) అబ్దుల్లా అబ్దుల్లా ఈ మేరకు దిల్లీలో పత్రాలను పరస్పరం అందజేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ..ఆఫ్గానిస్థాన్ అభివృద్ధికి, అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొనటానికి, ప్రజాస్వామ్యం నిలదొక్కుకోవటానికి భారత్ సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని పునరుద్ఘాటించారు. అనంతరం ఇద్దరు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించుకున్నారు. రెండు దేశాల మధ్య స్నేహబంధం మరింత దృఢతరం కావాలని ఆకాంక్షించారు. ఈ భేటీ సందర్భంగా ఆఫ్గానిస్థాన్ కళాకారులు ప్రత్యేకనైపుణ్యంతో తీర్చిదిద్దిన మొజాయిక్ చిత్రాన్ని ప్రధాని మోదీకి అబ్దుల్లా బహూకరించారు. భారత పర్యటనకు వచ్చిన అబ్దుల్లా గురువారం రాష్ట్రపతి భవన్కు వెళ్లి రాష్ట్రపతి కోవింద్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









