పోలీస్ శిక్షణలో ఆఫ్గాన్ పోలీసులకు భారత్ శిక్షణ
- September 28, 2017
పోలీస్ శిక్షణలో సాంకేతిక సహకారానికి సంబంధించి భారత్, ఆఫ్గానిస్థాన్ల మధ్య గురువారం అవగాహనా ఒప్పందం (ఎంఓయు) కుదిరింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆఫ్గాన్ ముఖ్య కార్యనిర్వాహకుడు (అధ్యక్షుడితో సమానమైన హోదా) అబ్దుల్లా అబ్దుల్లా ఈ మేరకు దిల్లీలో పత్రాలను పరస్పరం అందజేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ..ఆఫ్గానిస్థాన్ అభివృద్ధికి, అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొనటానికి, ప్రజాస్వామ్యం నిలదొక్కుకోవటానికి భారత్ సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని పునరుద్ఘాటించారు. అనంతరం ఇద్దరు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించుకున్నారు. రెండు దేశాల మధ్య స్నేహబంధం మరింత దృఢతరం కావాలని ఆకాంక్షించారు. ఈ భేటీ సందర్భంగా ఆఫ్గానిస్థాన్ కళాకారులు ప్రత్యేకనైపుణ్యంతో తీర్చిదిద్దిన మొజాయిక్ చిత్రాన్ని ప్రధాని మోదీకి అబ్దుల్లా బహూకరించారు. భారత పర్యటనకు వచ్చిన అబ్దుల్లా గురువారం రాష్ట్రపతి భవన్కు వెళ్లి రాష్ట్రపతి కోవింద్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







