రాబోయే రోజులలో ఏపీకే సైబర్‌ దాడుల ప్రమాదం ఎక్కువ : మంత్రి లోకేశ్‌

- September 29, 2017 , by Maagulf
రాబోయే రోజులలో ఏపీకే సైబర్‌ దాడుల ప్రమాదం ఎక్కువ : మంత్రి లోకేశ్‌

ఐటీ వాడకంలో ఆంధ్రప్రదేశ్‌ అందరికంటే ముందుందని, అలాగే సైబర్‌ దాడులు జరిగే ప్రమాదం కూడా ఏపీకే ఎక్కువగా ఉందని ఐటీశాఖ మంత్రి లోకేశ్‌ అన్నారు. కాగా ఈ రోజు ఆయన ఐటీశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ సైబర్‌ సెక్యూరిటీ ఆపరేషన్‌ సెంటర్‌ ఏర్పాటుపై చర్చించారు.
మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయన్నారు. సెకనుకు 12 మంది సైబర్‌ నేరాల వల్ల ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వాల సమాచారాన్ని హ్యాక్‌ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సాఫ్ట్‌వేర్‌, డేటా సెక్యూరిటీ లక్ష్యంగా సైబర్‌ సెక్యూరిటీ ఆపరేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని మంత్రి లోకేశ్‌ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com