ఫిలిఫైన్స్ మహిళపై పాకిస్థాన్ నిందుతుని అత్యాచారయత్నం
- September 29, 2017
దుబాయ్: బరి తెగించిన ఓ కామాంధునికి బస్టాండ్ లో కనబడిన మహిళపై అత్యాచారయత్నం చేయబోయి స్థానికులకు దొరికిపోయాడు. గురువారం రాత్రి గం.10-30 బస్ ఎక్కేందుకు ఓ ప్రవాసీ మహిళా బస్టాండ్కు వచ్చింది.ఫిలిఫైన్స్ నుంచి దుబాయ్ వచ్చిన ఆమె ఒక నిర్మాణ సంస్థలో అకౌంటెంట్గా పనిచేస్తోంది. విధులు ముగించుకొని బస్టాండ్ కి వచ్చింది. ఆ మహిళ బస్సు కోసం నిరీక్షిస్తున్నవేళ అక్కడే తచ్చట్లాడుతున్న పాకిస్థాన్ కు చెందిన నిందితుడు బస్టాండ్ లో ఎవరూ లేకపోవడం... పూటుగా మద్యం సేవించి ఉన్న నేపథ్యంలో ఆ వంటరి స్త్రీ పట్ల వెకిలిగా వ్యవహరించాడు. అంతటితో ఆగక ఒక్కసారిగా ఆమెపైకి దూసుకువెళ్ళాడు. పక్కనే ఉన్నరవాణా సరుకులు నిల్వ చేసే ఒక కంటెనర్లోకి ఆమెను బలవంతంగా లాక్కెళ్లాడు..ఆమె బిగ్గరగా అరిచినప్పటికీ లాభం లేకపోయింది. కొద్దిసేపట్లోనే అదే బస్టాండ్ వద్దకు నలుగురు వ్యక్తులు వచ్చారు. ఆమె అరుపులు విని కంటెనర్లోకి ఎక్కారు. ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడు పాకిస్తాన్ నుంచి దుబాయ్ వచ్చాడని పోలీసులు తెలిపారు. నిర్మాణ సంస్థలో కూలీగా పనిచేస్తున్నాడని వారు తెలిపారు. పోలీసులు అతడిని కోర్టులో హజరుపరిచారు. కోర్టు అతడికి ఆరు నెలలపాటు జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







