కువైట్ అవెన్యూలో ఒక దారి తాత్కాలికంగా మూసివేత
- September 29, 2017మనామా: ఉమ్ ఆళ్హస్సం జంక్షన్ సమీపంలో కువైట్ అవెన్యూలో విద్యుత్ కేబుల్స్ ను ఏర్పాటుచేసే పని తప్పనిసరి కాబడిందని ప్రజలకు ప్రకటించారు. దీంతో ఉత్తర దిక్కున ఉన్న ఎడమ దారిని మూసివేసి మనామాకు దారితీసే ట్రాఫిక్ ను వేరే ఒక దారి వైపునకు మళ్ళించబడుతుందని వర్క్స్, మునిసిపాలిటీ వ్యవహారాల మరియు అర్బన్ ప్లానింగ్ పథక అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మల్లింపును ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ తో సహకారంతో అమలుచేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దారి మూసివేత 29 వ తేదీ శుక్రవారం రాత్రి 11:00 గంటల నుండి అక్టోబర్ 2 వ తేదీ సోమవారం ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుంది. ఈ రహదారిని ఉపయోగించుకొనేవారందరు పైన పేర్కొన్న విషయాలను పరిగణన లోనికి తీసుకోవాలని కోరారు. అలాగే వాహనదారుల భద్రత కోసం ట్రాఫిక్ నియమాలను గమనించి వాటిని పాటించాలని తద్వారా సురక్షిత ప్రయాణం ఈ మార్గంలో కొనసాగించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!