ఎయిర్ ఇండియాను తాజాగా కాఫ్ సిరప్(దగ్గుమందు) స్మగ్లింగ్
- November 02, 2015
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరోసారి పతాక శీర్షికలకెక్కింది. రాకపోకల్లో ఆలస్యం, సిబ్బంది అలసత్వం, అక్రమరవాణా ఆరోపణలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న ఎయిర్ ఇండియాను తాజాగా కాఫ్ సిరప్(దగ్గుమందు) స్మగ్లింగ్ ఉదంతం కుదిపేసింది. సాక్షాత్తూ విమాన సిబ్బందే భారీ స్థాయిలో కాఫ్ సిరప్ (బెనడ్రిల్)ను స్మగ్ల్ చేస్తూ పట్టుబడ్డారు. ఢిల్లీ నుంచి లండన్ వెళుతోన్న విమానం నుంచి 450 బాటిళ్ల కాఫ్ సిరప్ (బెనడ్రిల్)ను స్వాధీనం చేసుకున్న లండన్ కస్టమ్స్ అధికారులు.. తదుపరి దర్యాప్తు నిమిత్తం విమాన సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, నెల రోజుల కిందట జరిగిన ఈ ఉదంతాన్ని ఎయిర్ ఇండియా అధికారులు దాచిపెట్టినప్పటికీ చివరికి బట్టబయలైంది. దీంతో కేంద్ర విమానయాన శాఖ మంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో సమర్థింబోమని, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి మహేశ్ శర్మ ప్రకటించారు. బెనిడ్రల్ సహా వివిధ కంపెనీల కాఫ్ సిరప్ లు భారత్ లో యథేచ్ఛగా అమ్ముతారు. కానీ లండన్ సిటీ సహా యునైటెడ్ కింగ్ డమ్ అంతటా ఈ మందుపై నిషేధం ఉంది. ఎక్కువ మోతాదులో కాఫ్ సిరప్ ను తాగితే.. మాదకద్రవ్యాలు (డ్రగ్స్) వాడినప్పుడు కలిగే అనుభూతి ఉంటుందని నిర్థారణ కావడంతోనే అక్కడి ప్రభుత్వాలు దగ్గు టానిక్ లను నిషేధించాయి. కాఫ్ సిరప్ ను డ్రగ్ గా ఉపయోగించిన ఉదంతాలు ఇటీవల హైదరాబాద్ లోనూ వెలుగులోకి రావటం గమనార్హం. యూకేలో డిమాండ్ దృష్ట్యా భారీ స్థాయిలో కాఫ్ సిరప్ అక్రమరవాణా అవుతోంది. లండన్ కు సరఫరా అవుతోన్న సిరప్ లో అధిక శాతం విమానల ద్వారా స్మగ్ల్ అవుతున్నట్లు, ఇందులో మహిళా సిబ్బంది పాత్రకూడా ఉన్నట్లు తెలిసింది. ఎయిర్ ఇండియా విమాన సిబ్బంది తమ లగేజీల్లో బంగారం, నిషేధిత ట్యాబ్లెట్లు తదితర వస్తువులతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







