తృటిలో తప్పిన ఘోర ఎయిర్ ఫ్రాన్స్ విమాన ప్రమాదం
- October 01, 2017
ప్రపంచ చరిత్రలో మరో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. 5 వందల ఇరవై మందితో వెళ్తున్న ఎయిర్ ఫ్రాన్స్ A 380 విమానం ఇంజన్ గాల్లోనే ధ్వంసమయ్యింది. దీంతో కెనడాలోని గూస్ బే ఎయిర్ పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు పైలెట్.. విమానం సేఫ్గా ల్యాండ్ కావడంతో.. ప్రయాణీకులంతా ఊపిరి పీల్చుకున్నారు.
పారిస్ నుంచి లాస్ ఏంజిల్స్కు వెళ్తున్న ఈ విమానంలో496 మంది ప్రయాణీకులతో పాటు 24 మంది సిబ్బంది ఉన్నారు. అట్లాంటిక్ సముద్రం మధ్యలోకి రాగానే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఓ ఇంజన్ పని చేయడం మానేసింది. పరిస్థితిని వెంటనే గమనించిన పైలెట్... ఆ విషయాన్ని ప్రయాణీకులకు చెప్పాడు... ఎమర్జెన్సీల్యాండింగ్కు ప్రయత్నిస్తున్నామన్నాడు. దీంతో విమానంలో టెన్షన్ మొదలయ్యింది. పైలెట్ మాత్రం చాకచక్యంగా వ్యవహరించి దగ్గరలో ఉన్న గూస్ బే ఎయిర్పోర్ట్లో జాగ్రత్తగా దింపడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







