తృటిలో తప్పిన ఘోర ఎయిర్ ఫ్రాన్స్ విమాన ప్రమాదం
- October 01, 2017
ప్రపంచ చరిత్రలో మరో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. 5 వందల ఇరవై మందితో వెళ్తున్న ఎయిర్ ఫ్రాన్స్ A 380 విమానం ఇంజన్ గాల్లోనే ధ్వంసమయ్యింది. దీంతో కెనడాలోని గూస్ బే ఎయిర్ పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు పైలెట్.. విమానం సేఫ్గా ల్యాండ్ కావడంతో.. ప్రయాణీకులంతా ఊపిరి పీల్చుకున్నారు.
పారిస్ నుంచి లాస్ ఏంజిల్స్కు వెళ్తున్న ఈ విమానంలో496 మంది ప్రయాణీకులతో పాటు 24 మంది సిబ్బంది ఉన్నారు. అట్లాంటిక్ సముద్రం మధ్యలోకి రాగానే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఓ ఇంజన్ పని చేయడం మానేసింది. పరిస్థితిని వెంటనే గమనించిన పైలెట్... ఆ విషయాన్ని ప్రయాణీకులకు చెప్పాడు... ఎమర్జెన్సీల్యాండింగ్కు ప్రయత్నిస్తున్నామన్నాడు. దీంతో విమానంలో టెన్షన్ మొదలయ్యింది. పైలెట్ మాత్రం చాకచక్యంగా వ్యవహరించి దగ్గరలో ఉన్న గూస్ బే ఎయిర్పోర్ట్లో జాగ్రత్తగా దింపడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.
తాజా వార్తలు
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్









