బహ్రెయిన్లో 'స్వచ్ఛతా హి సేవ' క్యాంపెయిన్
- October 01, 2017
మనామా: బహ్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ, 'స్వచ్ఛతా హి సేవా' క్యాంపెయిన్ని నిర్వహించింది. స్వచ్ఛ భారత్ అభియాన్ మూడో వార్షికోత్సవం సందర్భంగా 'స్వచ్ఛతా హీ సేవ' కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా చేపట్టేందుకు భారత ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో బహ్రెయిన్లోనూ ఇండియన్ ఎంబసీ ఈ కార్యక్రమం పట్ల అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతోంది. బహ్రెయిన్లో ఇండియన్ అంబాసిడర్ అలోక్ కుమార్ సిన్హా, ఈ సందర్భంగా స్వచ్ఛతపై అవగాహన ప్రతి ఒక్కరిలోనూ తప్పనిసరి అని చెప్పారు. ప్రముఖ బాలీవుడవ్ నటుడు సునీల్ శెట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని, అక్టోబర్ 2వ తేదీని స్వచ్ఛ భారత్ దివస్గా పరిగణిస్తోన్న సంగతి తెలిసినదే. అరేబియన్ క్రికెట్ ఫెస్టివల్లో పాల్గొననుండడం, అలాగే గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొనడం, స్వచ్ఛ భారత్ అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం ఇవన్నీ ఒకేసారి జరగడం చాలా ఆనందంగా ఉందని సునీల్ శెట్టి చెప్పారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత మెరుగుపడే దిశగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామనీ ఈ సందర్భంగా అలోక్ కుమార్ సిన్హా చెప్పారు.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







