వినూత్న ప్రయోగంతో వస్తున్న మంచు విష్ణు
- October 02, 2017
చెన్నై: నిన్నటి వరకు అనువాద చిత్రాలతోనే తెలుగు హీరోలు తమిళ మార్కెట్లోకి వచ్చేవారు. ఇప్పుడు ఏకంగా ద్విభాషా చిత్రంలో తమిళంలోకి అడుగుపెడుతున్నారు మన హీరోలు. ఆ జాబితాలో నటుడు విష్ణు కూడా చేరారు. కురల్ 388 చిత్రం ద్వారా ఆయన తమిళ తెరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో ఓటర్గా తెరకెక్కుతోంది. సంపత్రాజ్, పోసాని కృష్ణమురళి, నాజర్, మునీస్కాంత్, బ్రహ్మానందంలు ఇతర తారాగణం. రామారీల్స్ బ్యానరుపై జాన్ సుదీర్కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూర్చుతున్నారు. రాజేష్ యాదవ్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. జీఎస్ గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి విష్ణు మాట్లాడుతూ తిరుక్కురల్లో ఏడు పదాలతో ప్రపంచంలోని నీతులన్నింటినీ తెలియజేశారు. అందులోని 388వ నీతి ఆధారంగా ఈ సినిమా కథను తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుత కాలానికి తగ్గట్లు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నా తమిళ సినీరంగ ప్రవేశానికి ఈ సినిమా పూర్తిస్థాయిలో నప్పుతుందని నమ్ముతున్నా. ఇందులో ప్రేమ, యాక్షన్, హాస్యం అన్నీ కలగలసి ఉంటాయి.
విజయ దశమి రోజున సినీరంగ ప్రవేశం చేయడం ఆనందంగా ఉంది అని తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









