వినూత్న ప్రయోగంతో వస్తున్న మంచు విష్ణు
- October 02, 2017చెన్నై: నిన్నటి వరకు అనువాద చిత్రాలతోనే తెలుగు హీరోలు తమిళ మార్కెట్లోకి వచ్చేవారు. ఇప్పుడు ఏకంగా ద్విభాషా చిత్రంలో తమిళంలోకి అడుగుపెడుతున్నారు మన హీరోలు. ఆ జాబితాలో నటుడు విష్ణు కూడా చేరారు. కురల్ 388 చిత్రం ద్వారా ఆయన తమిళ తెరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో ఓటర్గా తెరకెక్కుతోంది. సంపత్రాజ్, పోసాని కృష్ణమురళి, నాజర్, మునీస్కాంత్, బ్రహ్మానందంలు ఇతర తారాగణం. రామారీల్స్ బ్యానరుపై జాన్ సుదీర్కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూర్చుతున్నారు. రాజేష్ యాదవ్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. జీఎస్ గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి విష్ణు మాట్లాడుతూ తిరుక్కురల్లో ఏడు పదాలతో ప్రపంచంలోని నీతులన్నింటినీ తెలియజేశారు. అందులోని 388వ నీతి ఆధారంగా ఈ సినిమా కథను తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుత కాలానికి తగ్గట్లు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నా తమిళ సినీరంగ ప్రవేశానికి ఈ సినిమా పూర్తిస్థాయిలో నప్పుతుందని నమ్ముతున్నా. ఇందులో ప్రేమ, యాక్షన్, హాస్యం అన్నీ కలగలసి ఉంటాయి.
విజయ దశమి రోజున సినీరంగ ప్రవేశం చేయడం ఆనందంగా ఉంది అని తెలిపారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం