వినూత్న ప్రయోగంతో వస్తున్న మంచు విష్ణు
- October 02, 2017
చెన్నై: నిన్నటి వరకు అనువాద చిత్రాలతోనే తెలుగు హీరోలు తమిళ మార్కెట్లోకి వచ్చేవారు. ఇప్పుడు ఏకంగా ద్విభాషా చిత్రంలో తమిళంలోకి అడుగుపెడుతున్నారు మన హీరోలు. ఆ జాబితాలో నటుడు విష్ణు కూడా చేరారు. కురల్ 388 చిత్రం ద్వారా ఆయన తమిళ తెరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో ఓటర్గా తెరకెక్కుతోంది. సంపత్రాజ్, పోసాని కృష్ణమురళి, నాజర్, మునీస్కాంత్, బ్రహ్మానందంలు ఇతర తారాగణం. రామారీల్స్ బ్యానరుపై జాన్ సుదీర్కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూర్చుతున్నారు. రాజేష్ యాదవ్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. జీఎస్ గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి విష్ణు మాట్లాడుతూ తిరుక్కురల్లో ఏడు పదాలతో ప్రపంచంలోని నీతులన్నింటినీ తెలియజేశారు. అందులోని 388వ నీతి ఆధారంగా ఈ సినిమా కథను తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుత కాలానికి తగ్గట్లు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నా తమిళ సినీరంగ ప్రవేశానికి ఈ సినిమా పూర్తిస్థాయిలో నప్పుతుందని నమ్ముతున్నా. ఇందులో ప్రేమ, యాక్షన్, హాస్యం అన్నీ కలగలసి ఉంటాయి.
విజయ దశమి రోజున సినీరంగ ప్రవేశం చేయడం ఆనందంగా ఉంది అని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









