అలా చేస్తే ట్రాఫిక్ జరీమానాల్లో 50 శాతం తగ్గింపు
- October 04, 2017
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమా పోలీసులు, ఉల్లంఘనకు పాల్పడిన 50 రోజుల్లోగా జరీమానా చెల్లిస్తే, 50 శాతం జరీమానా తగ్గించేలా కొత్త ఆఫర్ని ప్రకటించారు. 'రాడార్' పేరుతో ఈ ఆఫర్ని రస్ అల్ ఖైమా పోలీసులు ప్రకటించడం జరిగింది. రాడార్ బేస్డ్ జరీమానాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. 51 నుంచి 80 రోజుల లోపు చెల్లిస్తే, 30 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 80 రోజుల లోపు జరీమానా చెల్లించకపోతే, ఖచ్చితంగా పూర్తి జరీమానా వర్తిస్తుంది. అతి వేగంతో వాహనాలు నడపడం, నిబంధనల్ని ఉల్లంఘించడం ద్వారా ఇతరుల ప్రాణాలకు సైతం హాని కలిగించేవారవుతారు కాబట్టి, ఖచ్చితంగా వాహనదారులు తమ భద్రత కోసం, ఇతరుల భద్రత కోసం నిబంధనలు పాటించాలని రస్ అల్ ఖైమా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం, రెడ్ సిగ్నల్ జంపింగ్, రేసింగ్, కార్ విండోస్ ఓవర్ టింటింగ్ వంటి ఉల్లంఘనలకు ఎలాంటి డిస్కౌంట్ లభించదు.
తాజా వార్తలు
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్







