అలా చేస్తే ట్రాఫిక్ జరీమానాల్లో 50 శాతం తగ్గింపు
- October 04, 2017
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమా పోలీసులు, ఉల్లంఘనకు పాల్పడిన 50 రోజుల్లోగా జరీమానా చెల్లిస్తే, 50 శాతం జరీమానా తగ్గించేలా కొత్త ఆఫర్ని ప్రకటించారు. 'రాడార్' పేరుతో ఈ ఆఫర్ని రస్ అల్ ఖైమా పోలీసులు ప్రకటించడం జరిగింది. రాడార్ బేస్డ్ జరీమానాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. 51 నుంచి 80 రోజుల లోపు చెల్లిస్తే, 30 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 80 రోజుల లోపు జరీమానా చెల్లించకపోతే, ఖచ్చితంగా పూర్తి జరీమానా వర్తిస్తుంది. అతి వేగంతో వాహనాలు నడపడం, నిబంధనల్ని ఉల్లంఘించడం ద్వారా ఇతరుల ప్రాణాలకు సైతం హాని కలిగించేవారవుతారు కాబట్టి, ఖచ్చితంగా వాహనదారులు తమ భద్రత కోసం, ఇతరుల భద్రత కోసం నిబంధనలు పాటించాలని రస్ అల్ ఖైమా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం, రెడ్ సిగ్నల్ జంపింగ్, రేసింగ్, కార్ విండోస్ ఓవర్ టింటింగ్ వంటి ఉల్లంఘనలకు ఎలాంటి డిస్కౌంట్ లభించదు.
తాజా వార్తలు
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!









