అలా చేస్తే ట్రాఫిక్ జరీమానాల్లో 50 శాతం తగ్గింపు
- October 04, 2017
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమా పోలీసులు, ఉల్లంఘనకు పాల్పడిన 50 రోజుల్లోగా జరీమానా చెల్లిస్తే, 50 శాతం జరీమానా తగ్గించేలా కొత్త ఆఫర్ని ప్రకటించారు. 'రాడార్' పేరుతో ఈ ఆఫర్ని రస్ అల్ ఖైమా పోలీసులు ప్రకటించడం జరిగింది. రాడార్ బేస్డ్ జరీమానాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. 51 నుంచి 80 రోజుల లోపు చెల్లిస్తే, 30 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 80 రోజుల లోపు జరీమానా చెల్లించకపోతే, ఖచ్చితంగా పూర్తి జరీమానా వర్తిస్తుంది. అతి వేగంతో వాహనాలు నడపడం, నిబంధనల్ని ఉల్లంఘించడం ద్వారా ఇతరుల ప్రాణాలకు సైతం హాని కలిగించేవారవుతారు కాబట్టి, ఖచ్చితంగా వాహనదారులు తమ భద్రత కోసం, ఇతరుల భద్రత కోసం నిబంధనలు పాటించాలని రస్ అల్ ఖైమా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం, రెడ్ సిగ్నల్ జంపింగ్, రేసింగ్, కార్ విండోస్ ఓవర్ టింటింగ్ వంటి ఉల్లంఘనలకు ఎలాంటి డిస్కౌంట్ లభించదు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









