భారత్దేశంలో తగ్గిన బంగారం ధర
- October 05, 2017
బంగారు ఆభరణాల వ్యాపారుల నుంచి తగిన డిమాండ్ లేకపోవడంతో దేశంలో బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.225 తగ్గి రూ.30,375గా పలుకుతోంది. మరో పక్క అంతర్జాతీయంగా మాత్రం బంగారం ధరలు బాగానే పెరిగాయి. భారత్లో వెండి సైతం కేజీకి రూ.450 తగ్గి రూ.40 వేలకు పడిపోయింది. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు తగినంత లేకపోవడమే ఇందుకు కారణం.
స్థానిక వ్యాపారుల, రిటైలర్ల నుంచి పసిడికి డిమాండ్ లేదని దాంతో స్పాట్ మార్కెట్లో బంగారం ధరలు పెరగలేదని, అయితే విదేశాల్లో బంగారం డిమాండ్ కొనసాగుతుండటం వల్ల స్థిరంగా ధరలు ఉన్నాయని ట్రేడర్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా గోల్డ్ రేట్లు ఔన్సుకు 1275.40 డాలర్లుగా ఉండగా, వెండి సింగపూర్లో 0.24% తగ్గి ఔన్సుకు 16.61 డాలర్లుగా పలుకుతోంది.
దేశ రాజధాని డిల్లీలో 99.9%, 99.5% స్వచ్చత గల బంగారం ధరలు 10 గ్రాములకు రూ.225 తగ్గి వరుసగా రూ.30,375గాను, రూ.30,225గాను ఉన్నాయి. బుధవారం బంగారం ధరలు రూ.50 పెరిగాయి.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







