భారత్దేశంలో తగ్గిన బంగారం ధర
- October 05, 2017
బంగారు ఆభరణాల వ్యాపారుల నుంచి తగిన డిమాండ్ లేకపోవడంతో దేశంలో బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.225 తగ్గి రూ.30,375గా పలుకుతోంది. మరో పక్క అంతర్జాతీయంగా మాత్రం బంగారం ధరలు బాగానే పెరిగాయి. భారత్లో వెండి సైతం కేజీకి రూ.450 తగ్గి రూ.40 వేలకు పడిపోయింది. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు తగినంత లేకపోవడమే ఇందుకు కారణం.
స్థానిక వ్యాపారుల, రిటైలర్ల నుంచి పసిడికి డిమాండ్ లేదని దాంతో స్పాట్ మార్కెట్లో బంగారం ధరలు పెరగలేదని, అయితే విదేశాల్లో బంగారం డిమాండ్ కొనసాగుతుండటం వల్ల స్థిరంగా ధరలు ఉన్నాయని ట్రేడర్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా గోల్డ్ రేట్లు ఔన్సుకు 1275.40 డాలర్లుగా ఉండగా, వెండి సింగపూర్లో 0.24% తగ్గి ఔన్సుకు 16.61 డాలర్లుగా పలుకుతోంది.
దేశ రాజధాని డిల్లీలో 99.9%, 99.5% స్వచ్చత గల బంగారం ధరలు 10 గ్రాములకు రూ.225 తగ్గి వరుసగా రూ.30,375గాను, రూ.30,225గాను ఉన్నాయి. బుధవారం బంగారం ధరలు రూ.50 పెరిగాయి.
తాజా వార్తలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!









