భారత్‌దేశంలో తగ్గిన బంగారం ధర

- October 05, 2017 , by Maagulf
భారత్‌దేశంలో తగ్గిన బంగారం ధర

బంగారు ఆభరణాల వ్యాపారుల నుంచి తగిన డిమాండ్ లేకపోవడంతో దేశంలో బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.225 తగ్గి రూ.30,375గా పలుకుతోంది. మరో పక్క అంతర్జాతీయంగా మాత్రం బంగారం ధరలు బాగానే పెరిగాయి. భారత్‌లో వెండి సైతం కేజీకి రూ.450 తగ్గి రూ.40 వేలకు పడిపోయింది. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు తగినంత లేకపోవడమే ఇందుకు కారణం.
స్థానిక వ్యాపారుల, రిటైలర్ల నుంచి పసిడికి డిమాండ్ లేదని దాంతో స్పాట్ మార్కెట్లో బంగారం ధరలు పెరగలేదని, అయితే విదేశాల్లో బంగారం డిమాండ్ కొనసాగుతుండటం వల్ల స్థిరంగా ధరలు ఉన్నాయని ట్రేడర్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా గోల్డ్ రేట్లు ఔన్సుకు 1275.40 డాలర్లుగా ఉండగా, వెండి సింగపూర్లో 0.24% తగ్గి ఔన్సుకు 16.61 డాలర్లుగా పలుకుతోంది.
దేశ రాజధాని డిల్లీలో 99.9%, 99.5% స్వచ్చత గల బంగారం ధరలు 10 గ్రాములకు రూ.225 తగ్గి వరుసగా రూ.30,375గాను, రూ.30,225గాను ఉన్నాయి. బుధవారం బంగారం ధరలు రూ.50 పెరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com