పాకిస్తాన్: ఆత్మాహుతి దాడిలో 18 మంది మృతి
- October 05, 2017
పాకిస్థాన్: ఆత్మాహుతి దాడిలో 18 మంది మృతిచెందారు. ఈ దుర్ఘటన పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లోని ఝల్ మగ్సీ మసీదు వద్ద జరుగుతున్న ఉర్సు వేడుకల్లో ఈ విషాదం నెలకొంది. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మసీదులోకి చొరబడేందుకు యత్నించిన దుండగుడిని అడ్డుకునే క్రమంలో పేలుడు సంభవించడంతో ఓ పోలీస్ కానిస్టేబుల్ మృతిచెందడంతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. కాగా దాడికి పాల్పడింది తామేనని ఇంత వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు. మసీదులను టార్గెట్ చేసే తాలిబన్లే ఈ దాడికి పాల్పడి ఉంటారని సమాచారం.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









