పాకిస్తాన్: ఆత్మాహుతి దాడిలో 18 మంది మృతి

- October 05, 2017 , by Maagulf
పాకిస్తాన్: ఆత్మాహుతి దాడిలో 18 మంది మృతి

పాకిస్థాన్‌: ఆత్మాహుతి దాడిలో 18 మంది మృతిచెందారు. ఈ దుర్ఘటన పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని ఝల్‌ మగ్సీ మసీదు వద్ద జరుగుతున్న ఉర్సు వేడుకల్లో ఈ విషాదం నెలకొంది. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మసీదులోకి చొరబడేందుకు యత్నించిన దుండగుడిని అడ్డుకునే క్రమంలో పేలుడు సంభవించడంతో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ మృతిచెందడంతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. కాగా దాడికి పాల్పడింది తామేనని ఇంత వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు. మసీదులను టార్గెట్ చేసే తాలిబన్లే ఈ దాడికి పాల్పడి ఉంటారని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com