'కాళేశ్వరం' పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు చుక్కెదురు

- October 06, 2017 , by Maagulf
'కాళేశ్వరం' పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు చుక్కెదురు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించింది. అనుమతులు వచ్చే వరకు పనులు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టుకు అనుమతులు రాకుండానే పనులు ప్రారంభించారంటూ ఎన్జీటీలో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్... ప్రాజెక్టుపై స్టే ఇచ్చింది.

ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అయితే... తాగునీటి కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టామన్న తెలంగాణ ప్రభుత్వ వాదనను గ్రీన్ ట్రిబ్యునల్ పట్టించుకోలేదు. మధ్యంతర ఉత్తర్వులను 3 రోజుల పాటు నిలపుదల చేయాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సైతం తోసిపుచ్చింది.  అనుమతులు వచ్చే వరకు పనులు చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. 

కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డంకులు తాత్కాలికమేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని... ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతలది పైశాచికానందమని మండిపడ్డారు. కమ్యూనిస్టులకంటే మెరుగైన సిద్ధాంతాలతో కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని... భవిష్యత్‌లో కమ్యూనిస్టులు ఒక్క సీటు గెలవరని హరీశ్‌రావు ఎద్దేవాచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com