రష్యాలోని పెటుషిన్స్కీ ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం
- October 06, 2017
రష్యాలో శుక్రవారం తెల్లవారు జామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెటుషిన్స్కీ ప్రాంతంలోని పొక్రోవా రైల్వే స్టేషన్ వద్ద ఈ దారుణం జరిగింది. ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. రైలు వస్తుందన్న విషయాన్ని గమనించకుండా డ్రైవర్ పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే వేగంగా వస్తున్న రైలు బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి.
మాస్కోకు తూర్పున ఉన్న వ్లాడిమీర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బాధితులంతా సెంట్ పీటర్స్బర్గ్, నిజ్నీ నొవ్గొరోడ్ ప్రాంతాలకు చెందినవారని పోలీసులు తెలిపారు.క్షతగాత్రుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఉజ్బెకిస్తాన్ ప్రాంతం నుంచి కార్మికులను తీసుకుని వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నంబర్ ప్లేట్ ఆధారంగా ఆ బస్సు కజికిస్తాన్లో రిజిస్టర్ అయిందని రష్యా న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









