ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కుందన్ షా మృతి
- October 07, 2017
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కుందన్ షా మృతిచెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న కుందన్షా(69) తన నివాసంలో శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ‘‘జానే భి దో యారో’’ అనే చిత్రం ద్వారా వెండితెరపై తనదైన ముద్రవేసిన ఆయన ఆ తర్వాత అనేక మంచి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘‘జానే భి దో యారో’’ చిత్రానికి ఆయనకు జాతీయ అవార్డు వచ్చింది. 1984 లో దూరదర్శన్లో బాగా పాపులరైన కామెడీ సిరీస్ 'యహ్ జో హై జిందగీ' కు కుందన్ షా దర్వకత్వం వహించారు. కుందన్ షా మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
కాగా దేశంలో పెరిగిపోతున్న అసహన పరిస్థితులను నిరసినగా, అలాగే ది ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్టీఐఐ) విద్యార్థులకు మద్దతుగా 2015 నవంబర్లో 23 మంది దర్శకులతో కలిసి కుందన్ షా తన జాతీయ అవార్డును వెనక్కి పంపారు.
ఆయన దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలు
క్యా కహెనా (2000)
హమ్ తో మొహబ్బత్ కరెగా (2000)
దిల్ హై తుమ్హారా (2002)
ఏక్ సె బడ్కే ఏక్ (2004)
పీ సే పీఎం తక్ (2014)
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









