ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించనున్న పవన్ కల్యాణ్
- October 07, 2017
జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తారని ఆ పార్టీ మీడియా వ్యవహారాల ఇన్ఛార్జి హరిప్రసాద్ తెలిపారు. పవన్ ఇకపై నిరంతరం ప్రజల్లో తిరుగుతూ అందరికీ అందుబాటులో ఉంటారని ఆయన వెల్లడించారు. 2014లో అప్పటి పరిస్థితుల మేరుకు భాజపా, తెదేపాలకు జనసేన మద్దతిచ్చిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకుంటామనేది కాలమే నిర్ణయిస్తుందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడటానికి తమతో కలిసి వచ్చే పార్టీలన్నీ తమకు మిత్రపక్షాలేనని పేర్కొన్నారు.
త్వరలో పవన్ 'ప్రజాయాత్ర' చేయడం ఖాయమని.. దీని ముఖ్య ఉద్దేశం ప్రజా సమస్యల పరిష్కారమేనని స్పష్టం చేశారు. పాదయాత్ర లేదా బస్సు యాత్ర లేక ఇతర ఏ రూపంలోనైనా ప్రజాయాత్ర ఉంటుందని ఆయన వెల్లడించారు. ప్రజల సమస్యల పరిష్కారమే జనసేన అజెండా అని.. ప్రభుత్వ నిర్ణయం ప్రజామోదమైతే ఆమోదిస్తామని లేకపోతే వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని చెప్పారు.
ఏపీ ప్రత్యేక హోదాపై ఏ పార్టీతోనైనా కలిసి పోరాడటానికి జనసేన సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో 60 శాతం సీట్లు జన సైనికులకే ఇస్తామని వెల్లడించారు. జనసేన కోసం పనిచేసే వారందరికీ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









