జెడ్డాలోని రాజామందిర తనిఖీ ద్వారం వద్ద గన్ మాన్ దాడి : ఇద్దరు గార్డ్లులు మృతి
- October 07, 2017
జెడ్డా: స్థానిక జల్దాలోని ఆల్-సలామ్ ప్యాలెస్ పశ్చిమ తనిఖీ ద్వారం వద్ద శనివారం భద్రతా దళాలపై కలాష్నికోవ్ రైఫిల్ తో పాటు మూడు పెట్రోల్ బాంబులతో ఒక గన్ మాన్ జరిపిన దాడిలో ఇద్దరు రాజ రక్షక భటులు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ దాడికి పాల్పడిన 28 ఏళ్ళ సౌదీ వ్యక్తి మన్సూర్ బిన్ హసన్ అల్ అమెరిను భద్రతా దళాలు కాల్చి హతమార్చినట్లు అంతర్గత వ్యవహారాల ప్రతినిధి మన్సూర్ అల్-తుర్కి తెలిపారు.తుపాకి చేతబట్టిన నిందితుడు తన వాహనం వదిలి ఒక్కసారిగా గార్డ్ లపై కాల్పులు జరపడం ప్రారంభించాడని అల్-టర్కి చెప్పారు. ఈ దాడిపై పరిశోధనలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం









