జెడ్డాలోని రాజామందిర తనిఖీ ద్వారం వద్ద గన్ మాన్ దాడి : ఇద్దరు గార్డ్లులు మృతి
- October 07, 2017
జెడ్డా: స్థానిక జల్దాలోని ఆల్-సలామ్ ప్యాలెస్ పశ్చిమ తనిఖీ ద్వారం వద్ద శనివారం భద్రతా దళాలపై కలాష్నికోవ్ రైఫిల్ తో పాటు మూడు పెట్రోల్ బాంబులతో ఒక గన్ మాన్ జరిపిన దాడిలో ఇద్దరు రాజ రక్షక భటులు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ దాడికి పాల్పడిన 28 ఏళ్ళ సౌదీ వ్యక్తి మన్సూర్ బిన్ హసన్ అల్ అమెరిను భద్రతా దళాలు కాల్చి హతమార్చినట్లు అంతర్గత వ్యవహారాల ప్రతినిధి మన్సూర్ అల్-తుర్కి తెలిపారు.తుపాకి చేతబట్టిన నిందితుడు తన వాహనం వదిలి ఒక్కసారిగా గార్డ్ లపై కాల్పులు జరపడం ప్రారంభించాడని అల్-టర్కి చెప్పారు. ఈ దాడిపై పరిశోధనలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







