జెడ్డాలోని రాజామందిర తనిఖీ ద్వారం వద్ద గన్ మాన్ దాడి : ఇద్దరు గార్డ్లులు మృతి

- October 07, 2017 , by Maagulf
జెడ్డాలోని రాజామందిర తనిఖీ ద్వారం వద్ద గన్ మాన్ దాడి : ఇద్దరు గార్డ్లులు మృతి

జెడ్డా: స్థానిక జల్దాలోని ఆల్-సలామ్ ప్యాలెస్ పశ్చిమ తనిఖీ ద్వారం వద్ద శనివారం భద్రతా దళాలపై  కలాష్నికోవ్ రైఫిల్ తో పాటు మూడు పెట్రోల్ బాంబులతో ఒక గన్ మాన్ జరిపిన దాడిలో ఇద్దరు రాజ రక్షక భటులు మృతి చెందగా, మరో ముగ్గురు  తీవ్రంగా గాయపడ్డారు.ఈ దాడికి పాల్పడిన 28 ఏళ్ళ సౌదీ వ్యక్తి  మన్సూర్ బిన్ హసన్ అల్ అమెరిను భద్రతా దళాలు కాల్చి హతమార్చినట్లు అంతర్గత వ్యవహారాల ప్రతినిధి మన్సూర్ అల్-తుర్కి తెలిపారు.తుపాకి చేతబట్టిన నిందితుడు తన వాహనం వదిలి ఒక్కసారిగా గార్డ్ లపై కాల్పులు జరపడం ప్రారంభించాడని అల్-టర్కి చెప్పారు. ఈ దాడిపై పరిశోధనలు ఇంకా  కొనసాగుతూ       ఉన్నాయని ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com